సైకిల్‌ తొక్కుతున్న క్రికెటర్ ధోనీ.. వీడియో వైరల్.. అసలు విషయం ఏంటంటే..?

First Published Mar 30, 2024, 4:14 PM IST

ప్రముఖ భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఎలక్ట్రిక్ సైకిల్ తొక్కుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మహేంద్ర సింగ్ ధోనికి కార్లు, బైక్‌లు సేకరించడం అంటే చాలా ఇష్టమని చెప్పొచ్చు.
 

 ముఖ్యంగా ధోని నడుపుతున్న ఈ ఎలక్ట్రిక్ వాహనం గురించి తెలుసుకోవడానికి జనాలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దీనికి ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి ?  ధర ఎంత? ఈ వివరాలు ఏంటో  చూద్దాం...
 

డూడుల్ ఎలక్ట్రిక్ సైకిల్ సాధారణ సైకిల్ కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో 12.75 AH బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని ఛార్జ్ చేయడానికి 5-6 గంటలు పడుతుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 50 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.
 

దీనికి ముందు ఇంకా  వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. మీరు పుష్ బటన్‌ను ఉపయోగించి దీన్ని డ్రైవ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్   టాప్ స్పీడ్ గంటకు 25 కి.మీ. 250 W BLDC మోటార్ దీనిలో  ఉంది.
 

డూడుల్ ఎలక్ట్రిక్ సైకిల్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 49,999,  ఇన్సూరెన్స్ రూ. 3,277. మొత్తంమీద, ఈ బైక్ ఆన్-రోడ్ ధర రూ.53,276.
 

click me!