శశాంక్ శ్రీవాస్తవ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్), మారుతి సుజుకి ఇండియా మాట్లాడుతూ ఈ సంవత్సరం మే-జూన్లో ఉక్కు ధరలు గత ఏడాది కిలోకు రూ. 38 నుండి కిలోకు రూ. 65 కి పెరిగాయని అన్నారు. అదేవిధంగా రాగి ధరలు టన్ను US $ 5,200 నుండి $ 10,000కి రెట్టింపు అయ్యాయి. దీనితో పాటుగా రోడియం వంటి విలువైన లోహాల ధరలు మే 2020లో రూ .18,000 నుండి జూలైలో రూ. 64,300 వరకు పెరిగాయని తెలిపారు. ఈ కారణంగా కార్ల ధరలను పెంచడం తప్పనిసరి అయ్యింది అని వెల్లడించారు.