మాకు పోటీ మాకే.. బైక్ లవర్స్ కోసం కొత్త కవాసకి బైక్ లాంచ్ - ధర ఎంతో తెలుసా?

First Published Feb 9, 2024, 7:18 PM IST

కవాసకి అనేది భారతీయ వాహనదారులలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీ. ఇప్పుడు కంపెనీ ఒక కొత్త బైక్‌ను విడుదల చేయనుంది.
 

కవాసకి ఇండియా కొత్త నింజా 500ని మార్చి అండ్  ఏప్రిల్ 2024 మధ్య విడుదల చేయనుంది. నింజా 500 గత సంవత్సరం EICMA (ఎగ్జిబిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మోటార్ సైకిల్ అండ్ యాక్సెసరీస్)లో ఆవిష్కరించబడింది. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న నింజా 400కి ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది.
 

నింజా 500ని చూస్తే దాని ముఖ్యమైన ఫీచర్లు 451cc, పారలెల్-ట్విన్ ఇంజన్ మొదటి ఆకర్షణను పొందుతాయి. ఈ బైక్  9,000rpm వద్ద 45.4bhp, 6,000rpm వద్ద 42.6Nm శక్తిని  ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది.  అసిస్ట్ అండ్ స్లిప్ క్లచ్‌ కూడ ఉంది. ఈ బైక్  నింజా 400 ఇంజన్ కంటే మెరుగైనది. కవాసకి కొత్త నింజా 500లో టార్క్ అందించడానికి కొత్త ఇంజన్  ట్యూన్ చేయబడిందని పేర్కొంది.
 

ఎన్నో ప్రత్యేక ఫీచర్లతో వస్తున్న ఈ నింజా 500 ధర దాదాపు రూ. 5.2 లక్షల నుండి రూ. 5.4 లక్షల వరకు ఉంటుందని అంచనా. అలాగే మార్చి నెలాఖరులోగా విడుదల కానున్న ఈ బైక్ ప్రీ బుకింగ్స్ కూడా త్వరలో ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. కవాసకి ఇటీవల డబ్ల్యూ175 పేరుతో కొత్త బైక్‌ను విడుదల చేయడం కూడా గమనార్హం.
 

click me!