అజానీ కార్ టాప్ స్పీడ్ గంటకు 350 కి.మీ అని కంపెనీ పేర్కొంది. ఈ సూపర్ కార్ రెండు సెకన్లలోపు 0 నుండి 100 కి.మీ స్పీడ్ అందుకోగలదు. ఈ సూపర్ కారులో ఉపయోగించే ఎలక్ట్రిక్ మోటార్ 1,000 హెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఫుల్ ఛార్జ్తో 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని సంస్థ పేర్కొంది
ఎంఎంఎం సంస్థని 2012 సంవత్సరంలో సార్థక్ పాల్ స్థాపించారు అయితే 201లో బ్రాండ్ విలీనం అయ్యింది. భవిష్యత్తులో అత్యాధునిక, టెక్నాలజి ఆవిష్కరణలతో కూడిన భారతదేశపు మొట్ట మొదటి ఎలక్ట్రిక్ సూపర్ కారును నిర్మించడమే సంస్థ లక్ష్యం..