అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాన్నీ బుక్ చేసుకున్న లక్షలాది మందికి ఈ ట్రక్ డెలివరీ ఇంకా చేరుకోలేదు. అయితే, టెస్లా ఇప్పుడు నవంబర్ 30న సైబర్ట్రక్ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
ఈ ఏడాది నవంబరు 30న టెస్లా సైబర్ట్రక్ని లాంచ్ చేయడానికి ముందు, కంపెనీ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ అమ్మకపు నిబంధనలను వెల్లడించింది. టెస్లా సైబర్ట్రక్ను కొనే కస్టమర్లు మొదటి సంవత్సరంలో దానిని వేరొకరికి అమ్మలేరు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వాహనం కోసం వాహన కంపెనీ సేల్ నిబంధనలు అలా చెబుతున్నాయి. ఒక కస్టమర్ టెస్లా సైబర్ట్రక్ను కొన్న మొదటి సంవత్సరంలోని మరొకరికి అమ్మినట్లయితే అతను కార్ కంపెనీకి $ 50,000 (సుమారు రూ. 41.5 లక్షలు)ల భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిని ఒప్పంద ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.