వాహనాలు కొనే వారికి గుడ్న్యూస్.. త్వరలోనే వాహన రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు..
First Published Jun 2, 2021, 7:27 PM ISTన్యూ ఢీల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు భారతదేశం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా బ్యాటరీతో పనిచేసే వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల(ఆర్సి) జారీ, రెన్యూవల్ ఫీజు చెల్లించకుండా మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. బ్యాటరీల తయారీకి టెస్లా తరహా గిగాఫ్యాక్టరీలను నిర్మించడానికి రూ.18,100 కోట్ల విలువైన ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది.