ఈవిట్రిక్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వ్యవస్థాపకుడు మనోజ్ పాటిల్ మాట్లాడుతూ, "మేము ఒక దశాబ్దానికి పైగా ఆటోమేషన్ రంగంలో ఉన్నాము. ఇప్పుడు భారతదేశ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆటోమొబైల్ విప్లవంగా దీనిని నడిపిస్తున్నాము. ప్రస్తుత టెక్నాలజిని పరిగణనలోకి తీసుకుంటే వినియోగదారుల ప్రతిరోజు రాకపోకలకు ఈ స్కూటర్ బడ్జెట్ కొనుగోలు అవుతుంది. ఈ ఉత్పత్తులు కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా ఉంటాయి, తద్వారా మరింత ఆర్థికంగా ప్రయాణించగలుగుతారు.మధ్యప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటకలో ఢిల్లీ-ఎన్సిఆర్, ఉత్తర ప్రదేశ్లో విస్తరించడానికి బ్రాండ్ ఇప్పటికే డీలర్షిప్లను ప్రారంభించింది.