టాటా పంచ్‌కు పోటీగా హ్యుందాయ్ కొత్త ఎంట్రీ-లెవల్ ఎస్‌యూ‌వి.. ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే ?

First Published Jan 5, 2022, 1:41 PM IST

సౌత్ కొరియన్ ఆటోమోటివ్ కంపెనీ హ్యుందాయ్ క్రెటా (hyundai creta) దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూ‌వి. అయితే క్రెటా కారు హ్యుందాయ్‌ని కొత్త విజయాల దిశగా తీసుకెళ్లింది. హ్యుందాయ్ క్రెటా వరుసగా రెండవ సంవత్సరంలోను దేశపు మొదటి ఫేవరెట్ ఎస్‌యూ‌విగా అవతరించింది. 

మార్చి 2020లో క్రెటా ప్రారంభించినప్పటి నుండి హ్యుందాయ్ క్రెటా 1,25,437 యూనిట్లను విక్రయించగా, ఫేస్‌లిఫ్టెడ్ క్రెటా 2,15,000 యూనిట్లను విక్రయించింది. 
క్రెటాని మొదట 2015 సంవత్సరంలో ప్రారంభించారు, అప్పటి నుండి కంపెనీ ఆరు లక్షల యూనిట్లను విక్రయించింది. హ్యుందాయ్ ఇప్పుడు టాటా మోటార్స్‌కు పోటీగా కొత్త ఎస్‌యూ‌విని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
 

ఐదేళ్లలో 8.34 లక్షల ఎస్‌యూవీలు 
హ్యుందాయ్ ప్రకారం, కంపెనీ గత ఐదేళ్లలో 8.34 లక్షల ఎస్‌యూ‌విలను విక్రయించింది. ఇందులో హ్యుందాయ్ వెన్యూ కూడా కీలక పాత్ర పోషించింది. మే 2019లో ప్రారంభించినప్పటి నుండి కంపెనీ ఇప్పటివరకు 2.60 లక్షల యూనిట్ల వెన్యూను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. అదే సమయంలో 2021లో కంపెనీ  1.08 లక్షల యూనిట్ల వెన్యూను విక్రయించింది. ఇంకా హ్యుందాయ్ తాజా ఎస్‌యూ‌వి అల్కాజర్ కూడా మంచి పనితీరును కనబరుస్తోంది. ఇప్పటివరకు కంపెనీ 17,700 యూనిట్లను విక్రయించింది.

కోడ్ నెమ్ ఏ‌ఐ3 సియూ‌వి(Ai3 CUV)
నివేదికల ప్రకారం, హ్యుందాయ్ మార్కెట్లో తన పట్టును కొనసాగించాలని చూస్తోంది. హ్యుందాయ్ ఎంట్రీ-లెవెల్  ఎస్‌యూ‌వికి నిధులు సమకూరుస్తోంది. కంపెనీ దానికి కోడ్‌నేమ్‌కు Ai3 CUV (కాంపాక్ట్ యుటిలిటీ వెహికల్స్) అని పేరు పెట్టింది, దీనిని కంపెనీ 2023లో ప్రారంభించవచ్చు. హ్యుందాయ్  ఈ ఎస్‌యూ‌వి టాటా పంచ్‌తో పోటీపడుతుంది. అంతేకాకుండా హ్యుందాయ్ గ్లోబల్ పోర్ట్‌ఫోలియో నుండి 2022లో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి అయోనిక్ (Ioniq)ని విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతోంది. హ్యుందాయ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, “ఈ రోజుల్లో ప్రజలు ఎస్‌యూ‌విలను ఇష్టపడుతున్నారు ఇంకా మార్కెట్ లీడర్‌గా మేము కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త విభాగాలు అలాగే మార్కెట్‌లను పరిశోధిస్తున్నాము అని  అన్నారు.

శాంట్రో ప్లాట్‌ఫారమ్‌పై
హ్యుందాయ్ నుండి వచ్చిన ఈ కొత్త ఎస్‌యూ‌వి సబ్-4 మీటర్ సెగ్మెంట్‌లో ఉంటుందని నమ్ముతారు. ఈ మైక్రో  ఎస్‌యూ‌విని దక్షిణ కొరియాలో క్యాస్పర్ పేరుతో విక్రయిస్తున్నారు. శాంట్రో ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన కొత్త మైక్రో ఎస్‌యూ‌వి హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో అతి చిన్న మోడల్. కొత్త ఎస్‌యూ‌వి స్థానికంగా తయారు చేయబడుతుందని ఇంకా  క్యాస్పర్  అడ్జస్ట్ వెర్షన్ అని నమ్ముతారు. కాస్పర్ పొడవు 3595 mm, వెడల్పు 1595 mm, ఎత్తు 1575 mm ఉంటుంది. ఇంకా దీనికి 2.4 mm వీల్ బేస్ ఉంటుంది. కొరియన్ ఆధారిత కాస్పర్ రెండు ఇంజన్ ఆప్షన్లలో రానుంది. ఒకటి 1.0 లీటర్ తో వస్తుంది, ఇది 76 bhp శక్తిని ఇస్తుంది. రెండోది 1.0 లీటర్ టర్బో ఛార్జ్డ్ ఇంజన్ 100 bhp శక్తిని ఇస్తుంది. రెండు ఇంజన్లు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతాయి.

రెండవ స్థానంలో టాటా మోటార్స్
వచ్చే 5-6 ఏళ్లలో ఆరు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. హ్యుందాయ్‌కి ప్రస్తుతం లక్ష బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే కంపెనీ ఇప్పుడు 2022లో రెండంకెల వృద్ధిని చూస్తోంది. కంపెనీ 2022కి 7.3 లక్షల యూనిట్ల ఉత్పత్తి ప్రణాళికతో విక్రయదారులతో ప్లాన్‌లను రూపొందించింది, అంటే 2021లో కంటే 20 శాతం ఎక్కువ. మారుతీ సుజుకీ ఇండియా ఇప్పటికీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ విక్రయాలు డిసెంబర్ 2021లో నాలుగు శాతం క్షీణించి 1,53,149 యూనిట్లకు చేరుకున్నాయి. టాటా మోటార్స్ 35,300 యూనిట్లతో రెండవ స్థానంలో నిలిచింది. డిసెంబర్ 2021లో, హ్యుందాయ్ 32,312 యూనిట్ల అమ్మకాలతో మూడవ స్థానానికి చేరుకుంది.

click me!