ఉద్యోగంలో చేరడానికి బిఎమ్‌డబ్ల్యూ, కెటిఎమ్, జావా బైక్‌లు.. ఇండియన్ స్టార్టప్ సరికొత్త ఆలోచన..

First Published Jul 21, 2021, 11:43 AM IST

దేశంలోని వ్యాపారవేత్తలు  వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్త కొత్త పద్ధతులను ఉపయోగిస్తారు. అధిక జీతంతో పాటు ఉద్యోగులకు వివిధ ప్రయోజనాలు ఇవ్వడం కూడా ఇందులో ఉంటాయి.

అయితే వ్యాపార ప్రణాళికలను దూకుడుగా విస్తరించడానికి భరత్‌పే అనే టెక్ స్టార్టప్ 'టెకీలను' ఆకర్షించడానికి ఒక అసాధారణమైన మార్గాన్ని ప్రకటించింది. స్టార్టప్ ఉద్యోగాలు చేపట్టాలని చూస్తున్న ఉద్యోగులకు జాయినింగ్ అండ్ రిఫెరల్ ప్రోత్సాహకాలను అందిస్తోంది.భరత్‌పే "బైక్ ప్యాకేజీ" ప్రణాళికలో భాగంగా అనేక రకాల ప్రీమియం బైక్‌లను అందిస్తోంది. అంతేకాకుండా బైక్‌లను ఇష్టపడని వారికి టెక్నాలజి పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం "గాడ్జెట్ ప్యాకేజీ" పథకం కూడా ఉంది. ఉద్యోగంలో చేరిన ఉద్యోగి ఏదైనా ప్యాకేజీని ఎంచుకోవచ్చు.
undefined
100 మందికి ఉద్యోగాలు"మర్చంట్ అండ్ కన్జ్యూమర్ లెండింగ్ స్పేస్ లో వివిధ ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తున్న సంస్థ, దాని టెక్నాలజి బృందం బలాన్ని మూడు రెట్లు పెంచనుంది ఇందుకు మరో 100 మందిని కొత్తగా నియమించుకుంటుంది" అని భరత్‌పే ఒక ప్రకటనలో తెలిపింది.
undefined
ఈ బైక్‌లు అందుబాటులో ఉన్నాయిబైక్ ప్యాకేజీ కింద ఎంపిక చేసిన మోడళ్లలో 5 బైక్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్, కెటిఎం డ్యూక్ 390, జావా పెరాక్, కెటిఎం ఆర్‌సి 390, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ వంటి బైక్‌లు ఉన్నాయి. ఈ బైకులన్నీ ప్రీమియం కేటగిరీకి చెందినవి, ఇందులోని కెటిఎం ఆర్‌సి 390 ధర రూ .2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ). బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ ధర కూడా ఒకే విధంగా ఉంది, దీని ఢీల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ .2.50 లక్షలతో ప్రారంభమవుతుంది.
undefined
గాడ్జెట్లుగాడ్జెట్ ప్యాకేజీలో భాగంగా బోస్ హెడ్‌ఫోన్స్, ఆపిల్ ఐప్యాడ్ ప్రో, హర్మాన్ కార్డాన్ స్పీకర్లు, డబ్ల్యూహెచ్‌ఎఫ్ డెస్క్ అండ్ చైర్, శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అండ్ ఫైర్‌ఫాక్స్ టైఫూన్ 27.5 డి సైకిల్ ఉన్నాయి.
undefined
టి20 ప్రపంచ కప్‌ను చూసే అవకాశంఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ కోసం భారతదేశ మొత్తం టెక్ టీంకి దుబాయ్‌లో అక్టోబర్ 17 నుండి 2021 నవంబర్ 14 వరకు ఆతిథ్యం ఇవ్వనుంది. టెక్ టీం సభ్యులకు ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు చూసే అవకాశం లభిస్తుంది.
undefined
ఉత్తమ ప్రతిభఈ ప్రత్యేకమైన చొరవకు ప్రతిస్పందిస్తూ, భరత్‌పే సహ వ్యవస్థాపకుడు అండ్ సిఇఒ అష్నీర్ గ్రోవర్ మాట్లాడుతూ “భరత్‌పే టెక్నాలజి కలిగిన మొదటి ఫిన్‌టెక్. మేము భారతదేశంలో నిర్మించిన నెక్స్ట్ జనరేషన్ బ్యాంకింగ్‌ను, మార్కెట్-లీడింగ్ ఉత్పత్తులను స్కేల్‌గా నిర్మించడంలో మాతో కలిసి పనిచేయడానికి బెస్ట్ టెక్నాలజి ప్రతిభను ఆహ్వానిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. "అని అన్నారు.
undefined
click me!