హైదరాబాద్ కంటే ముందు బజాజ్ ఆటో చేతక్ కోసం మరో రెండు ప్రముఖ నగరాలైన పూణే, బెంగళూరులో ఈ నెల ప్రారంభంలో బుకింగ్లను తిరిగి ప్రారంభించింది. ఏప్రిల్లో మొదటి దశ బుకింగ్లలో అధిక డిమాండ్ కారణంగా కంపెనీ బుకింగ్ ప్రక్రియను 48 గంటల్లో నిలిపివేసింది.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మైసూర్, మంగళూరు, ఔరంగాబాద్, నాగ్పూర్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి గల కొనుగోలుదారులు కంపెనీ టోకెన్ మొత్తంగా రూ2,000 చెల్లించాల్సి ఉంటుంది. బజాజ్ ఆటో 2022 నాటికి మరో 20 నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది.
బజాజ్ చేతక్ 3.8 kW ఎలక్ట్రిక్ మోటార్పై పనిచేస్తుంది, అలాగే 5హెచ్పి పవర్, 16.2ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. పూర్తి ఛార్జ్పై బ్యాటరీ ఎకో మోడ్లో 90 కి.మీ వరకు ప్రయాణిస్తుందని బజాజ్ పేర్కొంది.