ఒక నివేదిక ప్రకారం గత వారం శుక్రవారం నాడు చిక్కసంద్ర హోబ్లీ పరిధిలోని రామన్పాళ్యకు చెందిన కెంపేగౌడ అనే రైతు తన సహచరులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు షోరూమ్కు వెళ్లాడు. అయితే అక్కడ నా బట్టలు, నా పరిస్థితి చూసి నేను డబ్బులిచ్చే పరిస్థితిలో లేను అని అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీ దగ్గర 10 రూపాయలు కూడా లేవు కానీ కారు కొంటారా అని అక్కడి ఫీల్డ్ ఆఫీసర్ ఒకరు నాతో అన్నారు. అసలు కారు కొనుక్కోవడానికి వచ్చే వారు ఇలా షోరూమ్ కి రారు ఆని కూడా అన్నారని తెలిపారు.