ఈ కార్లు కొనే వారికి బ్యాడ్ న్యూస్.. నేటి నుండి అమల్లోకి.. ఒక్క నెలలోనే రెండుసార్లు పెంపు..

First Published Jan 19, 2022, 12:07 PM IST

దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (tata motors) మంగళవారం  ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జనవరి 19 బుధవారం అంటే నేటి నుంచి అమలులోకి రానున్నాయి. టాటా మోటార్స్  వాహనాల ధరలను సగటున 0.9 శాతం మేర పెంచింది. అలాగే  కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కొన్ని మోడల్ వేరియంట్‌లపై కంపెనీ దాదాపు రూ.10,000 తగ్గించింది. 
 

పెరుగుతున్న ధరలు దేశంలోని వాహన తయారీదారులకు సవాలుగా మారింది. టాటా మోటార్స్ కార్ల మోడళ్ల ధరలను స్వల్పంగా పెంచడం ద్వారా మరోసారి  రుజువైంది. అయితే, మంగళవారం లేదా అంతకు ముందు టాటా మోటార్స్ వాహనాన్ని బుక్ చేసుకున్న వినియోగదారులందరికీ కంపెనీ ప్రైస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. అంటే జనవరి 18వ తేదీలోపు టాటా మోటార్స్ కారును బుక్ చేసుకున్న కస్టమర్లకు పాత ధరకే వాహనం లభిస్తుంది. 
 

ఈ నెలలో రెండోసారి 
 దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ జనవరి నుంచి  వాణిజ్య వాహనాల ధరను 2.5 శాతం పెంచనున్నట్లు గతంలో ప్రకటించింది. కంపెనీ  మిడ్ సైజ్ ఇంకా భారీ వాణిజ్య వాహనాలు, ఇంటర్మీడియట్ అండ్ లైట్ వెట్ వాణిజ్య వాహనాలు, చిన్న వాణిజ్య వాహనాలు, బస్సుల ధరలను జనవరి నుండి పెంచింది. అంటే కేవలం ఒక్క నెల జనవరిలో టాటా మోటార్స్  వాహనాల ధరలను రెండుసార్లు పెంచాలని నిర్ణయించింది. 
 

ఇతర బ్రాండ్లు కూడా 
టాటా మోటార్స్ ఈ నెలలో ధరల పెంపును ప్రకటిస్తు మారుతి సుజుకి (maruti suzuki) మార్గాన్ని అనుసరిస్తోంది. మారుతి గత వారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇదే విధమైన నిర్ణయాన్ని ప్రకటించింది, ఇందుకు ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం ఒక కూడా కారణమని పేర్కొంది. 

ఆటోమోటివ్ ఇండస్ట్రీ సవాళ్లు
తాజా ధరల పెంపును ప్రకటించిన దాదాపు ప్రతి ఆటోమోటివ్ బ్రాండ్ ఈ నిర్ణయాలకు ఇన్‌పుట్ అండ్ నిర్వహణ ఖర్చులు పెరగడం కారణమని పేర్కొన్నాయి.  అలాగే  ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ చిప్ కొరత ఉన్నందున, రానున్న భవిష్యత్తులో ఆటోమోటివ్ పరిశ్రమకు పెద్ద సవాళ్లుగా ఉండనున్నాయి.
 

అమ్మకాలపై ప్రభావం
ధరల పెంపు డిమాండ్‌ను ఎలా ప్రభావితం చేయగలదో రాబోయే కాలంలో తెలుస్తుంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (SIAM), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (SIAM) నుండి వచ్చిన డేటా ప్రకారం, గత డిసెంబర్‌లో దేశీయ మార్కెట్లో దాదాపు 2.19 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి, అంటే డిసెంబర్ 2020 గణాంకాలతో పోలిస్తే 13 శాతం తక్కువ. 

click me!