గత వారం శుక్రవారం కర్ణాటకలోని తుమకూరు మహీంద్రా షోరూమ్లో జరిగిన ఈ సంఘటన వీడియో విస్తృతంగా వైరల్ అయ్యింది అలాగే మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్లో ఫ్లాగ్ చేయబడ్డాయి. కర్ణాటక రైతు కెంపేగౌడ బొలెరో పికప్ ట్రక్కు కొనేందుకు వెళ్లగా సేల్స్ మెన్ హేళన చేస్తూ ప్రవర్తించి వెళ్లిపోవాలని కోరాడని సమాచారం.
బొలెరో పికప్ ట్రక్కు విలువ 10 లక్షలు ఉంటుందని సేల్స్ మ్యాన్ చెప్పగా, రైతు ప్రకారం " మీ జేబులో రూ.10 కూడా ఉండకపోవచ్చు " అని సేల్స్ మ్యాన్ తనతో అన్నడని చెప్పాడు. కెంపెగౌడ బట్టలు, రూపాన్ని బట్టి అవమానించారని రైతు, అతని స్నేహితులు ఆరోపించారు. దీంతో ఈ వాగ్వాదం చెలరేగింది. అప్పుడు కెంపెగౌడ ఒక గంటలో డబ్బు తీసుకువస్తే అదే రోజు బోలెరో ఎస్యూవిని డెలివరీ చేస్తావ అని సేల్స్మన్తో అన్నాడు.