ఈరోజున పాలు, పండ్లను తీసుకుంటూ ఉండాలి. రోజంతా భగవంతుడి ధ్యానంలో ఉంటూ, సంధ్యాసమయంలో పూజ పూర్తిచేసి రాత్రంతా జాగరణ చేస్తారు. అన్నపానీయాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తంటారు. వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాన్ని పఠించినా, విన్నా పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. ఉపవాస నియమాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి ముందు రాత్రి నేలపై నిద్రించాలి. ఏకాదశి రోజున ఎవరినీ దూషించవద్దు, మంచి ఆలోచనలనతో ఉండాలని పండిలు చెబుతుంటారు.