
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-
అవసరమైన గొడవలు. మానసిక ఒత్తిడి. ప్రస్తుత పరిస్థితుల కారణంగా వ్యాపార కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయి. మంచి వ్యక్తులతో అనుబంధం ఏర్పడుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఈ రోజు మీ పాత స్నేహితుడితో సంభాషించవచ్చు. మనసు ఆనందంగా ఉంటుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :-
అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఇతరులసహాయం తీసుకుంటారు. బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులెదుర్కుంటారు. నిరుద్యోగులకు ఏకాగ్రత అవసరం. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. దైవ, సేవాకార్యాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-
చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు.స్త్రీలకు పనిభారం అధికం అవడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. రిప్రజెంటివులకు, ప్రైవేటు సంస్థలలోని వారికి సదవకాశాలు లభిస్తాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో గొడవలు. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. ఓం నమశ్శివాయ అను మంత్రము 21 మార్లు జపించి నా శుభం జరుగును.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :-
అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత. గృహంలో స్వల్ప మార్పులు చేపడతారు. ప్రైవేటు కంపెనీలలో పనిచేసే వారికి ఒత్తిడి పెరుగుతుంది. దంపతుల ఆలోచనలు విరుద్ధంగా ఉంటాయి. అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు.కారణంగా కోపం. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు. వాహనం ఏకాగ్రతతో నడపాలి. వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట. అధికారులతో ఇబ్బందులు. వ్యాపారంలో చిన్న చిన్న చికాకులు తలెత్తినా సమసిపోతాయి.ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-
చేయు పనులయందు ఆలస్యం. అవివాహితులు శుభవార్తలు వింటారు. తాకట్టు వస్తువులను విడిపిస్తారు. కిరణా, ఫాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం కూడదు.అకారణంగా కోపం. ఉద్యోగం చేసే వ్యక్తులు ఉద్యోగంలో ఆటంకాల వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగ వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాల్లో కొత్త విషయాలు వింటారు. మానసిక ఒత్తిడి. అవివాహితులు శుభవార్తలు వింటారు. ఓం సూర్యాయ నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :-
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. ఈ రోజు మీకు మంచి ప్రారంభం కానుంది. మీరు మీ చేతుల్లోకి తీసుకున్న ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. విద్యార్థుల మనస్సు చదువులో నిమగ్నమై ఉండదు. ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. మహాలక్ష్మీ నమః అనే మంత్రమును 21 మార్లు జపించి న శుభం జరుగుతుంది
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :-
అనవసరమైన గొడవలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. పెద్దమొత్తం ధనం చెల్లింపులో ఆలోచన, తోటివారి సలహా తీసుకోవటం ఉత్తమం.చేయి పనుల యందు పట్టుదల కలిగి ఉండటారు. వృత్తి వ్యాపారాల యందు సామాన్యం. ఏదో ఒక సమస్య వలన మనసు కలత చెందుట. ప్రయాణాల యందు జాగ్రత్త వహించవలెను. విద్యార్థులు కష్టపడవలెను. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :-
అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రేమికులకు కుటుంబ వ్యతిరేకత, చికాకులు అధికం. స్థిరాస్తి అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. పోగొట్టు పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.ఓం నమశ్శివాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
ధనుస్సు రాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-
కొత్త ఆలోచనలు చేస్తారు. గృహమునందు శుభకార్యములు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ధనం చెల్లింపులు, పుచ్చుకునే విషయంలో సరిచూసుకోండి. ఇతరులతో మంచి విషయం గురించి చర్చిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పట్టుదలతో పనుల యందు విజయం సాధిస్తారు. ఉద్యోగ,వ్యాపారులకు అనుకూలం. ఓం నమో నారాయణాయ అని మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :-
కష్టము నుండి సులువుగా బయటపడతారు. శాంతంగా మాట్లాడతారు. పెద్దల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖుల కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఇతరుల సహాయం తీసుకొనవలసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల యందు సామాన్యం. చేయు పనులయందు జాప్యం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరగును.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-
శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఇంట్లోనే ఉంటూ చాలా వరకు పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు సమయం చాలా కష్టంగా ఉంటుంది. కానీ నిరుత్సాహపడకండి. మీకు ఏవైనా కోర్టు సంబంధిత విషయాలు ఉంటే, ఈ రోజు మీరు వాటి నుండి కొంత ఉపశమనం పొందవచ్చు. అధికారులు పనిని చూసి మెచ్చుకుంటారు.వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. ఓందుర్గాయై నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.
మీనరాశి ( Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-
చేయు పనులయందు అనుకూలం. బంధుమిత్రుల యొక్క సహకారం లభించును. . వృత్తి జీవితంలో పరిస్థితులు మీ కోరిక మేరకు ఉంటాయి. మీ వ్యాపారంలో కొన్ని పనులు చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే, అవి ఈ రోజు పూర్తి కాగలవు. పనిలో ఒకరి మద్దతు మీకు లాభిస్తుంది. మీరు తల్లిదండ్రుల ప్రేమను పొందుతారు. పిల్లల ఆనందాన్ని పొందుతారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగును. చేయవలసిన పనులు గురించి ఇతరులతో చర్చిస్తారు. ధనమును గురించి చేయు ప్రయత్నములు ఫలిస్తాయి. ఓం నమశ్శివాయ అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.
పంచాంగం
12 మే 2022 గురువారం
శుభ కృత నామ సంవత్సరం
ఉత్తరాయణం
వైశాఖ మాసం
శుక్లపక్షం
ఏకాదశి మధ్యాహ్నం3:11నిల వరకు తదుపరి ద్వాదశి
ఉత్తర నక్షత్రం సాయంత్రం.4:21 ని|| వరకు
వర్జ్యం రా.12:46 లగాయతు రా.2:22ని.లవరకు
దుర్ముహూర్తం ఉదయం09:48ని. లగాయతు 10:39ని. వరకు మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:54ని.ల లగాయతు 3:45ని.ల వరకు
రాహుకాలం మధ్యాహ్నం01:30ని.ల లగాయతు మధ్యాహ్నం 3:00ని.ల వరకు
యమగండం ఉదయం 6:00ని.ల లగాయతు ఉదయం7:30ని.ల వరకు
సూర్యోదయం ఉదయం 5:33ని.లకు
సూర్యాస్తమయం సాయంత్రం 6:19ని.లకు.
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)