జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఒక గ్రహం రాశి మారినప్పుడల్లా, దాని ప్రభావం వ్యక్తులపై పడుతుంది. గ్రహాలకు అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం మకరరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే సూర్యుడు, శుక్రుడు కూడా మకరరాశిలో ఉన్నారు. అయితే కుజుడు, సూర్యుడి కలయిక మంగళ ఆదిత్య రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ రాజయోగం ధైర్యం, నాయకత్వం, విజయం, గౌరవం, వృత్తి పురోగతికి సంకేతం. ఈ రాజయోగం వల్ల 3 రాశులవారు శుభ ఫలితాలు పొందుతారు. ఆ రాశులేంటో చూద్దామా..