హిందూ మత విశ్వాసాల ప్రకారం.. ఏ శుభకార్యమైనా సరే ముందుగా వినాయకుడినే పూజిస్తారు. ఈయన ఆశీస్సులు ఉంటే ఎంతటి పనైనా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతుందని నమ్మకం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే వినాయకుడు విఘ్నాలను తొలగించే భగవంతుడు. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి ఆశీస్సులు ఉంటే జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. అలాగే సంపద, ఆదాయం, ఆరోగ్యం పెరుగుతాయని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. వినాయకుడి అనుగ్రహం కొన్ని రాశుల వారిపై ఎప్పుడూ ఉంటుంది. అలాగే వారి కష్టాలను తొలగిస్తాడు. విఘ్నేషుడి ఆశీస్సులతో వీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. మరి వినాయకుడికి ఇష్టమైన రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..