దీపావళి పండగ అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ఈ పండగ సంతోషాన్ని మాత్రమే కాకుండా, అదృష్టాన్ని కూడా ఇస్తుంది అంటే ఎవరైనా వద్దు అంటారా..? జోతిష్యశాస్త్రం ప్రకారం, ఏ రాశివారికి ఏ రంగు ఈ దీపావళి అదృష్టాన్ని తెస్తుందో చూడాలి.
1.మేష రాశి..
అంగారకుడిని మేష రాశికి అధిపతిగా పరిగణిస్తారు, అందువలన ఈ రాశివారు ఎరుపు రంగుకి ఆకర్షితులౌతారు. మీరు మేషరాశి అయితే, మీరు ఎరుపు రంగు వస్త్రం లేదా మెరూన్ వంటి ఎరుపు రంగులను ఎంచుకోవచ్చు. ఈ దీపావళి సమయంలో ఈ రంగు మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఇది మీ జీవితంలో ఆనందం, అదృష్టం తెస్తుంది. లక్ష్మీదేవిని ఆకర్షిస్తున్నందున ఈ రంగును కూడా శుభప్రదంగా పరిగణిస్తారు.