ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004 ఎన్నికలకు ముందు సీఎల్పీ లీడర్గా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అప్పటికే సుమారు 9 ఏళ్లకు పైగా చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నారు.విద్యుత్ చార్జీల పెంపు, వరుస కరవు పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో వైఎస్ఆర్ నిర్వహించిన పాదయాత్ర ఆ పార్టీకి కలిసొచ్చింది.
undefined
నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే చంద్రబాబునాయుడు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ, సీపీఐఎం, టీఆర్ఎస్లు ఎన్నికల పొత్తు పెట్టుకొన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆ సమయంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
undefined
2009 ఎన్నికల్లో కూడ రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీ సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్లతో మహాకూటమిగా పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. రెండోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
undefined
2014 ఎన్నికల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓటమి పాలయ్యాడు.
undefined
2004 ఎన్నికల్లో వైఎస్ఆర్ చేతిలో, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ చేతిలో చంద్రబాబునాయుడు ఓటమి పాలయ్యాడు. 1999 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు చేతిలో వైఎస్ఆర్, 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు చేతిలో జగన్ ఓటమి పాలయ్యారు.
undefined