వైసీపీ జాబితాలో దక్కని చోటు: ఆఫీస్‌పై దాడి, రెబెల్స్‌గా పోటీ

First Published Mar 17, 2019, 2:19 PM IST

విశాఖ జిల్లా వైసీపీ నేతలు అలకబూనారు. టిక్కెట్లు దక్కని కారణంగా  విశాఖ ఎంపీ స్థానం నుండి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంపై వంశీకృష్ణ వర్గీయులు ఆదివారం నాడు దాడికి దిగారు.
 

విశాఖ జిల్లా వైసీపీ నేతలు అలకబూనారు. టిక్కెట్లు దక్కని కారణంగా విశాఖ ఎంపీ స్థానం నుండి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంపై వంశీకృష్ణ వర్గీయులు ఆదివారం నాడు దాడికి దిగారు.
undefined
విశాఖ పట్టణంలోని విశాఖ తూర్పు స్థానం నుండి డాక్టర్ విజయనిర్మలకు వైసీపీ టిక్కెట్టు కేటాయించింది.ఈ స్థానం నుండి వైసీపీ నేత వంశీకృష్ణ టిక్కెట్టు ఆశించారు. ఈ స్థానంలో వంశీకృష్ణకు టిక్కెట్టు కేటాయించలేదు. దీంతో వంశీకృష్ణ వర్గీయులు విశాఖ ఎంపీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంపై ఆదివారం నాడు దాడికి దిగారు.
undefined
పార్టీ కోసం ఇంతకాలం పాటు కష్టపడిన తనను కాదని మరోకరికి టిక్కెట్టు కేటాయించడంపై వంశీకృష్ణ మనోవేదనకు గురయ్యాడు. వంశీకృష్ణకు టిక్కెట్టు కేటాయించకపోవడంతో ఓ మహిళా కార్యకర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
undefined
మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్‌కు విశాఖ దక్షిణ స్థానాన్ని కేటాయించడంపై ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కో ఆర్డినేటర్ రమణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుచరులతో ఆయన ఆదివారం నాడు సమావేశమయ్యారు. తన అనుచరుల సమావేశంలో భవిస్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నట్టు ఆయన ప్రకటించారు.
undefined
అమలాపురం సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబుకు వైసీపీ టిక్కెట్టు కేటాయించలేదు. గత ఎన్నికల్లో రవీంద్రబాబు టీడీపీ నుండి విజయం సాధించారు. ఇటీవలనే ఆయన వైసీపీలో చేరారు. రవీంద్రబాబుకు బదులుగా అనరాధకు వైసీపీ టిక్కెట్టు కేటాయించింది.దీంతో రవీంద్రబాబు మనస్తాపానికి గురయ్యాడు.
undefined
విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ బొప్పన భవ్‌కుమార్‌కు టిక్కెట్టు కేటాయించింది.ఈ స్థానం నుండి యలమంచిలి రవి టిక్కెట్టు ఆశించారు. టీడీపీ నుండి రవి వైసీపీలో చేరారు. అయినా కూడ రవికి టిక్కెట్టు దక్కలేదు. యలమంచిలి రవి రెబెల్‌గా బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నారు.
undefined
టీడీపీకి చెందిన దాసరి జై రమేష్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావులు కూడ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. దాసరి జై రమేష్ విజయవాడ ఎంపీ స్థానాన్ని ఆశించారు. అయితే దాసరి జై రమేష్‌కు బదులుగా ఇటీవలనే పార్టీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్‌కు జగన్ టిక్కెట్టు కేటాయించారు.
undefined
click me!