లగడపాటి సర్వేకి జగన్ షాక్..! టీడీపీ గల్లంతు

First Published May 23, 2019, 10:47 AM IST

జాతీయ మీడియా సంస్థలు వైసీపీదే విజయమని తేల్చగా.. లగడపాటి మాత్రం టీడీపీదే అధికారం అని చెప్పారు. ఆయన మాటలు... టీడీపీ నేతల్లో బలాన్ని నింపింది. 

ఆంధ్ర ఆక్టోపస్, మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వే కి జగన్ షాకిచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు గురువారం కౌంటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.
undefined
కాగా... ఈ ఫలితాల్లో వైసీపీ అధినేత జగన్ దూసుకుపోతున్నారు. ఆయన పార్టీ అభ్యర్థులు రాష్ట్రంలోని అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ ఆధిక్యంలో మేజిక్ ఫిగర్ ని చేరుకుంది.
undefined
అయితే.. ఇప్పుడంతా... మాజీ ఎంపీ లగడపాటి సర్వే గురించే టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. లగడపాటి సర్వే మిస్ ఫైర్ అయ్యిందని వాపోతున్నారు.
undefined
ఈ ఎన్నికలకు ఇటీవల ఎగ్జిట్ పోల్స్ వెలువడగా.. అందులో అన్ని జాతీయ మీడియా సంస్థలు వైసీపీదే విజయమని తేల్చగా.. లగడపాటి మాత్రం టీడీపీదే అధికారం అని చెప్పారు.
undefined
ఈ ఎన్నికలకు ఇటీవల ఎగ్జిట్ పోల్స్ వెలువడగా.. అందులో అన్ని జాతీయ మీడియా సంస్థలు వైసీపీదే విజయమని తేల్చగా.. లగడపాటి మాత్రం టీడీపీదే అధికారం అని చెప్పారు.
undefined
ఆయన మాటలు... టీడీపీ నేతల్లో బలాన్ని నింపింది. తన సర్వే ప్రకారం టీడీపీ 100 నుంచి 110 సీట్లు వస్తాయని.. వైసీపీకి 70దాకా వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
undefined
కానీ లగడపాటి చెప్పిన దానికి.. ఇక్కడ జరుగుతున్న దానికి పొంతనే కనిపించడం లేదు. లగడపాటి చెప్పిన దాంట్లో కనీసం సగం కూడా టీడీపీ సాధించేలా కనిపించడం లేదు. అంతెందుకు 30సీట్లు గెలుచుకోవడం కూడా కష్టతరంగానే ఉంది.
undefined
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ లగడపాటి సర్వే ఫెయిల్ అయ్యింది. గతంలో ఎన్నికలు రాగానే... అందరూ కళ్లు లగడపాటిపైనే ఉండేవి. ఇప్పటి ఫలితాలతో.. ఇక లగడపాటి సర్వేని ఎవరూ నమ్మే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
undefined
click me!