ఎగ్జిట్ పోల్ ఫలితాల ఎఫెక్ట్: అభ్యర్థులతో జగన్ భేటీ రద్దు

First Published May 21, 2019, 8:21 AM IST

పార్టీ అభ్యర్థులతో మంగళవారం అభ్యర్థులతో తలపెట్టిన భేటీని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రద్దు చేసుకున్నారు

పార్టీ అభ్యర్థులతో మంగళవారం అభ్యర్థులతో తలపెట్టిన భేటీని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రద్దు చేసుకున్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాల నేపథ్యంలో ఆయన ఈ భేటీని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దానికి బదులుగా ఎన్నికల ఫలితాల తీరును గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచి సమీక్షించాలని నిర్ణయించుకున్నారు.
undefined
మంగళవారం తాడేపల్లి నివాసంలో జగన్ పార్టీ అభ్యర్థులతో భేటీ అవుతారని, ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు మొదట తెలిపాయి. అయితే ఆదివారం ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వెలువడిన తర్వాత తన షెడ్యూల్‌ మార్చుకున్నారని చెబుతున్నారు. అభ్యర్థులతో భేటీని రద్దుచేసుకున్నారని అంటున్నారు
undefined
బుధవారం సాయంత్రం ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకుని, అతి ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, జాతీయ మీడియా వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్‌, స్థానికంగా వచ్చిన ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలపై విశ్లేషిస్తారని అంటున్నారు. కేంద్రంలో ఎన్‌డీఏనే మళ్లీ వస్తుందని దాదాపు అన్ని సర్వేలూ స్పష్టం చేసినా.. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వచ్చేసరికి స్పష్టత లేదు. కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. మరికొన్ని మళ్లీ తెలుగుదేశం పార్టీకి అధిక స్థానాలను ఇచ్చాయి
undefined
మాజీ పార్లమెంటు సభ్యుడదు లగడపాటి రాజగోపాల్‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. దీంతో జగన్‌, వైసీపీ ముఖ్య నేతలు లగడపాటి సర్వేపై చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. లగడపాటి ప్రయోజనం పొంది సర్వే ఫలితాలను అలా వెల్లడించారని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఫలితాలు తప్పుగా తేలిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, అంతర్గతంగా మాత్రం ఆయన సర్వేపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది
undefined
టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా 8.5 నుంచి 10 శాతం దాకా ఉందని జాతీయ సర్వేలు అంటున్నాయి. దీంతో ఆ సర్వేలపై కూడా వైసిపి నేతలు అంతర్గతంగా చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈసారి పోల్‌ మేనేజ్‌మెంట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకబడ్డారని, వ్యూహాల అమలులో ఆయన విఫలమైనట్లు కనిపించారని అంటున్నారు. క్షేత్ర స్థాయి పోల్‌ మేనేజ్‌మెంట్‌లో తాము పూర్తి ఆధిక్యం ప్రదర్శించామని చెబుతున్నారు
undefined
ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా, క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్ మెంటులో పైచేయి సాధించడం వల్ల టీడీపీకి గట్టి పోటీ ఇచ్చామని, టీడీపిపై ఆధిపత్యం సాధించామని వైసిపి నాయకులు అంటున్నారు. దాంతో అంత పెద్ద మొత్తంలో ఓట్ల శాతంలో తేడా ఉంటుందనే విషయాన్ని వారు విశ్వసించడం లేదు
undefined
ఎన్నికల్లో పది శాతం తేడా అంటే.. ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని, పోలింగ్‌ జరిగిన వెంటనే ఎవరు గెలుస్తారో చెప్పేయవచ్చని వైసిపి నేతలు అంటున్నారు. కానీ బూత్‌ స్థాయిలో అలాంటి పరిస్థితి లేదని, పోటీ నువ్వానేనా అనేట్లుగా ఉందని చెబుతున్నారు. విజయం ఎవరిని వరిస్తుందనేది చివరకు వరకు వేచి చూడాల్సిన పరిస్థితే ఉందనే ఆలోచనలో వారున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వారిలో కొంత మేరకు ధీమా కలిగించాయి. అయితే అదే సమయంలో ఆందోళన కూడా కలిగిస్తున్నాయి
undefined
click me!