బాలినేని ఫిర్యాదు: నారా లోకేష్ కట్టడికి వైసీపీ కొత్త ఎత్తుగడ, బీజేపీ సైతం

First Published Aug 24, 2020, 1:28 PM IST

అరెస్టుల పర్వం మొదలవగానే లోకేష్ ముందుకు వచ్చాడు. అచ్చెన్న, జేసీ కుటుంబాలను కలిసి రావడం, మొదలైన చర్యల వల్ల పార్టీ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేసాడు. ఇక ఫీల్డ్ మీద లేని టైం లో సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నాడు లోకేష్. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లోఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనేఒక బ్రహ్మాండ విజయాన్ని నమోదు చేసింది వైసీపీ. అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 23 స్థానాల్లోనే గెలవడం అందరిని షాక్ కి గురి చేసింది. ఫలితాల ముందు వరకు తామే గెలుస్తామని చెప్పిన టీడీపీ నేతలు... ఫలితాలు వెలువడ్డాక తామెందుకు ఓడామో అర్థం కావడంలేదని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసారు.
undefined
ఒకకసారిగా పార్టీలో నైరాశ్యం నెలకొంది. క్యాడర్ అంతా కూడా ఓటమిని జీర్ణం చేసుకోలేకపోయారు. ఓడడం ఒకెత్తయితే.... ఇంత చిత్తుగా ఓడినవైనం వారిని తీవ్రంగా కలిచి వేసింది. పరిస్థితిని గమనించిన చంద్రబాబు నాయుడు, ఎందుకు ఓడామో అర్థం కావడంలేదు అనే వైఖరిని పక్కనబెట్టి పార్టీ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నాలను మొదలుపెట్టారు.
undefined
చంద్రబాబు తన ప్రయత్నాలను మొదలుపెట్టగానే లోకేష్ కూడా యాక్టీవ్ గా మారడానికి కృషి చేయడం మొదలుపెట్టాడు. ప్రజా సమస్యలపైనా పోరాటం అంటూ ముందుకొచ్చాడు. చాలా తెలివిగా వైసీపీ వారు లోకేష్ ని పనికిరానివాడు అని చూపెట్టడానికి ఎప్పటినుండో ప్రయత్నాలు మొదలుపెట్టారు.
undefined
విజయసాయి రెడ్డి మాలోకం, పప్పు అంటూ రకరకాల పేర్లను వాడుతూ... రాజకీయాలకు లోకేష్ పనికిరాడు అనే ఒక ఇమేజ్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేసారు. టీడీపీ భావి నాయకుడు లోకేష్ కాబట్టి ఆయనను టార్గెట్ చేస్తే టీడీపీ బలహీనపడిపోతుందని వైసీపీ వారు ఎత్తుగడ వేశారు. అన్ని వెరసి లోకేష్మంగళగిరిలోఓటమి పాలయ్యాడు.
undefined
ఇక ఎన్నికల తరువాత లోకేష్ ఓటమిని ప్రొజెక్ట్ చేస్తూ ఇప్పటికి కూడా ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. ఎన్నికల తరవాత నుండే టీడీపీని నిర్వీర్యం చేయడానికి వైసీపీ వారు అనేక పథకాలనును రచించారు. ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కొంతమంది టీడీపీని వీడగా, ఆర్ధిక మూలాలపై పడుతున్న దెబ్బలకు మరికొంతమంది పార్టీని వీడారు.
undefined
ఇక ప్రస్తుతం వరుస అరెస్టులతో టీడీపీ బెంబేలెత్తిపోతోంది. అచ్చెన్నాయుడు, జేసీ వంటి వారి అరెస్టులు, వైసీపీ మంత్రుల నెక్స్ట్ ఈయనే అంటూ చేసే వ్యాఖ్యలు అన్ని వెరసి టీడీపీని బలంగానే దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతుంది. అవినీతి కేసులో దోషి ఎవరైనా శిక్షంపబడాల్సిందే. కానీ ఇవి రాజకీయఅరెస్టులుగా మాత్రమే మిగిలిపోకూడదు.
undefined
ఇక అరెస్టుల పర్వం మొదలవగానే లోకేష్ ముందుకు వచ్చాడు. అచ్చెన్న, జేసీ కుటుంబాలను కలిసి రావడం, మొదలైన చర్యల వల్ల పార్టీ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేసాడు. ఇక ఫీల్డ్ మీద లేని టైం లో సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నాడు లోకేష్.
undefined
లోకేష్ వ్యాఖ్యలకు రీచ్ ఈమధ్యకాలంలో ఎక్కువవుతుంది. టీడీపీ అభిమానులు చాలామంది సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ అయ్యారు. ఇక దీనితో లోకేష్ ని ఇప్పుడు మరింతగా కట్టడి చేయవలిసిన అవసరం వైసీపీకి వచ్చిపడింది. దీనితో ఇప్పుడు మరో అస్త్రాన్ని ముందుకు తెచ్చారు వైసీపీ వారు.
undefined
ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే అరెస్టులు ఎక్కువయ్యాయి. చంద్రబాబు దీనిపై బహిరంగంగానే విమర్శించారు కూడా. తాజాగా బీజేపీ కూడా సొసైల్ మీడియా ట్రోలింగ్ పై సీరియస్ అయింది. జీవీఎల్ నరసింహ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసారని వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు కూడా.
undefined
ఈ వరుసలోనే లోకేష్ కి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నుండి నోటీసు అందిందని సమాచారం. మొన్నామధ్య తమిళనాడులో పట్టుబడ్డ సొమ్ము విషయంలో.... ఆ డబ్బు బాలినేనికి చెందిందని లోకేష్ పోస్టు పెట్టాడు. దీనిపై లోకేష్ తో సహా మరికొంతమందికి నోటీసులు అందాయి.
undefined
తమ మీద అసత్య ప్రచారాలను చేస్తే చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని వైసీపీ వారు ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ని ఇస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ వారు కూడా సోషల్ మీడియాలో తమపై అసత్య ప్రచారం జరుగుతోందని చట్టప్రకారం నడుచుకుంటామని చెప్పారు. ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇచ్చారు.
undefined
రాష్ట్రంలో ప్రస్తుతానికి యాక్టీవ్ గా ఉన్న పార్టీలు జనసేన, వైసీపీ, టీడీపీ, బీజేపీ. జనసేన మిత్రుడు, వైసీపీ రహస్య మిత్రుడు, ఇక మిగిలింది టీడీపీ మాత్రమే. వాస్తవానికి టీడీపీ వారు సైతం బీజేపీ స్నేహ హస్తం కోసం ఎదురు చూస్తున్నవారు. అయినప్పటికీ టీడీపీని టార్గెట్ చేస్తున్న వైనం చూస్తుంటే... కలిసి వైసీపీ, బీజేపీ టీడీపీని కార్నర్ చేస్తున్నట్టుగా అనిపించక మానదు.
undefined
click me!