కరోనా దెబ్బ: తగ్గిన టీటీడీ ఆదాయం, పెరిగిన ఖర్చులు

First Published Mar 3, 2021, 12:56 PM IST

కరోనా ప్రభావం టీటీడీపై తీవ్రంగా కన్పిస్తోంది. కరోనాతో టీటీడీ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఆదాయం తగ్గిపోవడమే కాదు ఖర్చులు పెరిగిపోవడంతో టీటీడీకి దిక్కుతోచని స్థితి నెలకొంది.

కరోనా ప్రభావం టీటీడీ ఆర్ధిక పరిస్థితిపై తీవ్రంగా పడింది. గత ఐదేళ్లలో టీటీడీ ఖర్చులు భారీగా పెరిగాయి. మరోవైపు పెట్టుబడులు, ఆదాయం భారీగా తగ్గడంతో టీటీడీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
undefined
అత్యధిక ఆదాయాన్ని సంపాదించే దేవాలయంగా టీటీడీకి పేరుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రూ. 2,937 .82 కోట్ల ఆదాయం టీటీడీకి వస్తోందని అంచనా వేసింది టీటీడీ.
undefined
టీటీడీకి రూ. 1,131 కోట్లు హుండీతో పాటు ఇతర రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.టీటీడీకి వచ్చే ఆదాయంలో హుండీ ఆదాయం ప్రధానమైంది.
undefined
ప్రతి ఏటా టీటీడీ వేతనాలతో పాటు ఇతర అవసరాల కోసం రూ. 1308.15 కోట్లు చెల్లించాల్సి వస్తోంది.హుండీ ఆదాయంతో పాటు టికెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం ఉద్యోగుల వేతనాల కోసం కేటాయిస్తోంది టీటీడీ.
undefined
ఉద్యోగులకు ప్రతి ఏటా వేతనాల పెంపుతో పాటు ఇతర ప్రయోజనాల చెల్లింపు విషయాలను కూడ టీటీడీ పరిశీలించాల్సిన అవసరం నెలకొంది.
undefined
బడ్జెట్ అంచనాలను పరిశీలిస్తే హుండీ నుండి వచ్చే ఆదాయం సుమారు రూ. 300 కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. 2016-17 నుండి 2020-21 వరకు రూ. 300 కోట్లు ఆదాయం వచ్చింది) అయితే ఉద్యోగుల వేతనాల చెల్లింపు కోసం రూ. 600 నుండి 700 కోట్ల మేరకు చెల్లించాల్సి వచ్చింది.ఆదాయానికి, ఖర్చుకు మధ్య చాలా తేడా వచ్చింది.
undefined
హుండీ ఆదాయం 2016 నుండి 2019 వరకు రూ. 1,010 కోట్ల నుండి రూ. 1351 కోట్లకు పెరిగింది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన హుండీ అంచనాలు రూ. 1,131 కోట్లకు తగ్గాయి.
undefined
ఉద్యోగుల వేతనాల కోసం 2016-17లో రూ. 500 నుండి 575 కోట్లు. అయితే ప్రస్తుతం ఉద్యోగుల వేతనం రూ. 1238.60 కోట్లకు చేరుకొంది. అదనంగా సవరించిన 2020-21 బడ్జెట్ లో పెన్షన్ ఫండ్ కోసం రూ. 75 కోట్లను టీటీడీ అంచనా వేసింది.
undefined
కార్పస్, ఇతర పెట్టుబడులపై అంచనా వ్యయం గత ఆరేళ్ల నుండి ఏడేళ్లుగా తగ్గిపోతున్నాయి. కార్పస్, పెట్టుబడులు గత కొన్నేళ్లుగా ఇలా ఉన్నాయి. 2014-15 లో రూ. 969 కోట్లు, 2015-16లో రూ. 475 కోట్లు, 2016-17లో రూ. 86 కోట్లు, 2018-19లో రూ. 86 కోట్లు, 2019-20లో రూ.165.42 కోట్లు, 2020-21 లో రూ. 150 కోట్లు వచ్చినట్టుగా టీటీడీ చెబుతోంది.
undefined
పెట్టుబడులపై వడ్డీలు కూడ తగ్గుతున్నాయి. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ రసీదుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 738.18 కోట్లు, 2019-20లో రూ. 857.28 కోట్లు.
undefined
పెట్టుబడులు తగ్గడంతో పాటు జాతీయ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు తక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ ఆదాయాలను పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో టీటీడీ వెనక్కి తగ్గింది.
undefined
2019-20 లో వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ. 738.18 కోట్లకు పడిపోయింది. రూ. 857.28 కోట్ల నుండి రూ. 738.18 కోట్లకు పడిపోయింది.
undefined
2022లో రూ. 533.10 కోట్లు వడ్డీ ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.
undefined
click me!