టోక్యో ఒలింపిక్స్ లో సత్తాచాటిన తెలుగమ్మాయి.. రజనికి భారీ నజరానా అందించిన జగన్

First Published Aug 11, 2021, 4:10 PM IST

టోక్యో ఒలింపిక్స్ 2020 లో సత్తాచాటిన అంతర్జాతీయ మహిళా హాకీ జట్టులో తెలుగమ్మాయి రజని కూడా వుంది. తాజాగా స్వరాష్ట్రానికి చేరుకున్న ఆమె సీఎం జగన్ ను కలవగా ఆయన భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. 

అమరావతి: ఒలింపిక్స్‌ మహిళా హకీలో టీమిండియా తరపున ఆడి విశేష ప్రతిభ చూపిన తెలుగు హాకీ ప్లేయర్ ఇ. రజనీ బుధవారం ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తల్లిదండ్రులతో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న రజనిని మంత్రి అవంతి శ్రీనివాస్ సీఎం దగ్గరుండి జగన్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రజనికి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందించారు సీఎం. ఈ క్రమంలోనే ఈమెకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు.

అమరావతి: ఒలింపిక్స్‌ మహిళా హకీలో టీమిండియా తరపున ఆడి విశేష ప్రతిభ చూపిన తెలుగు హాకీ ప్లేయర్ ఇ. రజనీ బుధవారం ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తల్లిదండ్రులతో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న రజనిని మంత్రి అవంతి శ్రీనివాస్ సీఎం దగ్గరుండి జగన్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రజనికి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందించారు సీఎం. ఈ క్రమంలోనే ఈమెకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. 

టోక్యో ఒలింపిక్స్ 2020 ల సత్తాచాటినందుకు గాను రజనీకి రూ. 25లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. అలాగే ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మహిళా హాకీ జట్టులో మరింత రాణించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తేవాలని రజనికి జగన్ సూచించారు.

టోక్యో ఒలింపిక్స్ 2020 ల సత్తాచాటినందుకు గాను రజనీకి  రూ. 25లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. అలాగే ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మహిళా హాకీ జట్టులో మరింత రాణించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తేవాలని రజనికి జగన్ సూచించారు.  
 

గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి పెండింగ్‌లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తిరుపతిలో 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి పెండింగ్‌లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తిరుపతిలో 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. 
 

రజనీ స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలంపిక్స్‌ హకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌తో పాటు టోక్యో ఒలంపిక్స్‌ 2020లో కూడా ఆమె పాల్గొన్నారు. ఇప్పటివరకు 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్‌లలో రజని పాల్గొని ప్రతిభ కనపరిచారు.

రజనీ స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలంపిక్స్‌ హకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు.  2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌తో పాటు టోక్యో ఒలంపిక్స్‌ 2020లో కూడా ఆమె పాల్గొన్నారు. ఇప్పటివరకు 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్‌లలో రజని పాల్గొని ప్రతిభ కనపరిచారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ కుటుంబ సభ్యులు, క్రీడాశాఖ మంత్రితో పాటు శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, శాప్‌ వీసీ అండ్‌ ఎండీ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ అధికారులు రామకృష్ణ, జూన్‌ గ్యాలట్, రాజశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ కుటుంబ సభ్యులు, క్రీడాశాఖ మంత్రితో పాటు శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, శాప్‌ వీసీ అండ్‌ ఎండీ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ అధికారులు రామకృష్ణ, జూన్‌ గ్యాలట్, రాజశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు. 

click me!