రైతు బాంధవుడు.. మారువేషంలో విజయవాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ! (ఫొటోలు)

First Published Aug 7, 2021, 9:30 AM IST

ఆ షాపు యజమాని సబ్ కలెక్టర్ అడిగిన ఎరువులు ఇచ్చాడు. కానీ, రేటు విషయానికి వచ్చేసరికి MRP ధర కన్నా అధికంగా వసూళ్లు చేశాడు సదరు షాపు యజమాని. అంతేకాదు వసూళ్లు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వలేదు. 

విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు. ఎరువులు కావాలని ఓ దుకాణంలోకి వెళ్లిన సబ్ కలెక్టర్ కు స్టాక్ ఉన్నా యజమాని లేవని చెప్పాడు.
undefined
దీంతో అక్కడి నుండి మరో షాపుకు వెళ్లి ఎరువులు కావాలని సబ్ కలెక్టర్ అడిగారు. ఆ షాపు యజమాని సబ్ కలెక్టర్ అడిగిన ఎరువులు ఇచ్చాడు. కానీ, రేటు విషయానికి వచ్చేసరికి MRP ధర కన్నా అధికంగా వసూళ్లు చేశాడు సదరు షాపు యజమాని. అంతేకాదు వసూళ్లు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వలేదు.
undefined
దీంతో వెంటనే అక్కడికక్కడే సబ్ కలెక్టర్ ఒకొక్క అధికారికి ఫోన్ చేసి, ఎరువుల షాపుకు పిలిపించారు. ఆరెండు షాపులను సీజ్ చేయించారు. ఆ తరువాత అక్కడి నుండి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లిన సబ్ కలెక్టర్.
undefined
ముదినేపల్లిలో సబ్ కలెక్టర్ వెళ్లిన షాపు మూసి వేసి ఉండటంతో సబ్ కలెక్టర్ అక్కడి రైతులను వాకబు చేశారు. MRP ధరల కన్నా ఎక్కువ రేటుకు ఎరువులు అమ్ముతున్నారని రైతులు సబ్ కలెక్టర్ కు తెలిపారు. దీంతో షాపు యజమానిని పిలిపించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
undefined
ముదినేపల్లిలో సబ్ కలెక్టర్ వెళ్లిన షాపు మూసి వేసి ఉండటంతో సబ్ కలెక్టర్ అక్కడి రైతులను వాకబు చేశారు. MRP ధరల కన్నా ఎక్కువ రేటుకు ఎరువులు అమ్ముతున్నారని రైతులు సబ్ కలెక్టర్ కు తెలిపారు. దీంతో షాపు యజమానిని పిలిపించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
undefined
click me!