ఇంటి ఇలవేల్పుగా పూజించే వెంకటేశ్వరస్వామికి డబ్బులనే కాదు బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను కూడా సమర్పిస్తుంటారు భక్తులు. ఇలా ఈ ఆర్థిక సంవత్సరంలో 1,031 కిలోల బంగారాన్ని భక్తులు స్వామివారికి సమర్పించారు. కేవలం గత మూడేళ్లలోనే స్వామివారికి 4వేల కిలోల బంగారాన్ని సమర్పించారు. దీంతో నిత్యం స్వామివారికి అలంకరించే స్వర్ణాభరణాలు, వివిధ బ్యాంకుల్లో టిటిడి డిపాజిట్ చేసిన బంగారం మొత్తం 11,329 వేల కిలోలకు చేరువయ్యింది.