జగన్-రోజా అన్నాచెల్లి వరసల కథేంటి?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసారు. కాంగ్రెస్ ను ఎదిరించి సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓ హోదాలో వున్నారు. కాబట్టి ఆయన అందరినీ కలుపుకుపోతూ హుందాగా మెలగాల్సి వుంటుంది. పార్టీ నాయకులు సైతం వయసుతో సబంధం లేకుండా వైఎస్ జగన్ ను గౌరవిస్తూ సార్ అని కొందరు, అన్న అని మరికొందరు పిలుస్తుంటారు.