Tirumala: తిరుమ‌ల తిరుప‌తి వెంకన్న ఆల‌య సంపద ఎంతో తెలుసా?

Published : Feb 14, 2025, 08:41 AM ISTUpdated : Feb 14, 2025, 12:08 PM IST

TirumalaTirupati Temple treasures: తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాలలో ఒకటి. దీనికి భ‌క్తుల నుంచి విరాళాలు, కానుక‌లు భారీగానే వస్తాయి. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు నిర్వహిస్తుంది.

PREV
15
Tirumala: తిరుమ‌ల తిరుప‌తి వెంకన్న ఆల‌య సంపద ఎంతో తెలుసా?

Tirumala Tirupati Devasthanam: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆల‌యం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాని గొప్ప చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, సంపదలో గుర్తింపు సాధించింది. ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే ప్రదేశాలలో ఒకటి. 

25
Tirumala

తిరుమ‌ల ఆల‌య చ‌రిత్ర 

తిరుమ‌ల తిరుప‌తి ఆల‌యాన్ని తమిళ రాజు తొండమాన్ నిర్మించార‌ని చ‌రిత్ర చెబుతోంది. త‌ర్వాత‌ దీనిని చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు మ‌రింత‌ విస్తరించి పునరుద్ధరించారు.  11వ శతాబ్దంలో రామానుజాచార్యులు ఆలయ ఆచారాలను అధికారికంగా రూపొందించారు. 

35

తిరుమ‌ల తిరుప‌తి ఆల‌య సంపద ఎంత‌?

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విలువ దాదాపు 3,00,000 కోట్లు రూపాయలని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలిగా గుర్తింపు పొందింది. విజయనగర సామ్రాజ్యంలో ఆలయ సంపద, పరిమాణం పెర‌గ‌డం ప్రారంభ‌మైంది. ప్రస్తుతం భారీ సంపదతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల్లో 11,225 కిలోల బంగారం, 7,600 ఎకరాలకు పైగా భూమి, పెద్దమొత్తంలో బ్యాంకు డిపాజిట్లు, 9,071.85 కిలోల వెండి ఆభరణాలున్నాయి.

తిరుమ‌ల తిరుప‌తికి నిత్యం దేశంలోనే కాకుండా ప్ర‌పంచ దేశాల‌ నుంచి భ‌క్తులు, యాత్రికులు వ‌స్తుంటారు. నిత్యం ర‌ద్దీగా ఉంటుంది. తిరుప‌తి వెంక‌న్న‌కు స‌మ‌ర్పించుకునే కానుక‌లు, విరాళాలు భారీగానే ఉంటాయి. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాలలో ఒకటి. దీనికి భ‌క్తుల నుంచి విరాళాలు, కానుక‌లు కార‌ణం. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహిస్తుంది.

45
Tirumala Tirupati temple

తిరుమ‌ల తిరుప‌తి దేవాల‌య ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటి? 

తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర ఆలయం 300 AD నుండి ప్రారంభమయ్యే కాలంలో నిర్మించార‌ని చ‌రిత్ర చెబుతోంది. ఈ ఆలయం పల్లవులు, చోళులు, రెడ్లు, విజయనగర రాజులతో సహా అనేక రాజవంశాలు పాల‌న‌లో అభివృద్ధి చెందింది. 

ఈ ఆలయం విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుడు కోలువై ఉన్నాడు. కలియుగంలో మాన‌వులు ఎదుర్కొనే కష్టాల నుండి రక్షించడానికి శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ వెలిశాడ‌ని న‌మ్ముతారు. అలాగే, ఈ ఆలయానికి తీర్థయాత్ర చేయడం వల్ల ఆత్మ శుద్ధి అవుతుందనీ, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

55
tirumala tirupati

ఏడు కొండ‌ల వెంక‌న్న పేరెలా వ‌చ్చింది? ఆల‌య నిర్మాణ‌మూ ప్ర‌త్యేక‌మే ! 

తిరుమ‌ల తిరుప‌తి వెంక‌న్న ఆలయం శేషాచలం కొండలలో భాగమైన తిరుమల కొండలపై ఉంది. ఈ ఆలయం దక్షిణ భారత తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఆలయ సముదాయం 16.2 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఈ ఆలయం ఏడవ శిఖరం అయిన వెంకటాద్రిపై ఉన్నందున దీనిని "ఏడు కొండల ఆలయం" అని కూడా పిలుస్తారు. "పడివాకిలి, సింహద్వారం" అని కూడా పిలువబడే ఆలయ ప్రధాన ద్వారం 13వ శతాబ్దం నుండి అనేకసార్లు ఎత్తు పెంచారు. 

తిరుపతిలోని ఇతర ఆలయాలు

శ్రీ గోవిందరాజస్వామి ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించారు. క్రీ.శ. 1130లో రామానుజాచార్యులచే ప్రతిష్టించబడింది. శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని చోళ రాజులు క్రీ.శ. 10వ శతాబ్దంలో నిర్మించారు.

Read more Photos on
click me!

Recommended Stories