చిత్తూరు : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపు ప్రమాదానికి గురై మూడు ఏనుగులు మృతి చెందిన హృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. బుధవారం రాత్రి ఏనుగుల గుంపు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపును లోడ్ తో వెళుతున్న మినీ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మూడు ఏనుగులు మృతి చెందాయి. వీటిలోఒకటి పెద్దదైన మగ ఏనుగు. కాగా, రెండు చిన్న ఏనుగులు. అందులో ఒకటి ఆడా, ఒకటి మగ.