వారాహి యాత్ర నేపథ్యంలో పవన్ కల్యాణ్ ధర్మపరిరక్షణ యాగం..

Published : Jun 12, 2023, 01:32 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14న వారాహితో ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ధర్మ పరిరక్షణ.. ప్రజా క్షేమం.. సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాగం చేపట్టారు. మంగళగిరిలో జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ యాగం జరుగుతోంది.  

PREV
15
  వారాహి యాత్ర నేపథ్యంలో పవన్ కల్యాణ్ ధర్మపరిరక్షణ యాగం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14న వారాహితో ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ధర్మ పరిరక్షణ.. ప్రజా క్షేమం.. సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాగం చేపట్టారు. మంగళగిరిలో జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ యాగం జరుగుతోంది.
 

25

పవన్ కల్యాణ్  తలపెట్టిన యాగానికి గణపతి పూజతో  స్వయంగా అంకురార్పణ చేశారు. సోమవారం ఉదయం 6 గంటల 55 నిమిషాలకు పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధారణలో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. 

35

ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు. యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు. 
 

45

స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి, శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాత, అష్టైశ్వర్య ప్రసాదాధిపతులు శివపార్వతులు, ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత.. త్రిస్థితియుక్త కారకుడు శ్రీ మహావిష్ణువు ఈ యాగపీఠంపై పరివేష్టితులై ఉన్నారు. ఈ ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. 

55

విగ్రహం.. యంత్రం.. హోమం ఆలంబనగా ఈరోజు  ఉదయం ప్రారంభమైన ఈ యాగం రేపు కూడా కొనసాగుతుందని జనసేన పార్టీ తెలిపింది. ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్దంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం ధార్మిక చింతనను కలిగిస్తోందని పేర్కొంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories