తిరుపతి ఎంపీ స్థానానికి ఉపఎన్నిక: టీడీపీ ప్లాన్ ఇదీ...

First Published Dec 27, 2020, 2:57 PM IST

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  విజయం సాధించేందుకు టీడీపీ కసరత్తులు ప్రారంభించింది.  ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రాజకీయంగా వైసీపీపై పైచేయి సాధించాలని టీడీపీ  భావిస్తోంది.

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపై టీడీపీ కేంద్రీకరించింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో తిరుపతి ఉప ఎన్నికలపై టీడీపీ దృష్టిని సారించింది.
undefined
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే ఈ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
undefined
తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీడీపీ ఇప్పటి నుండే కసరత్తులు ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఆ పార్టీ యంత్రాంగం పనిచేస్తోంది.
undefined
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకొన్న పరిస్థితులపై రాష్ట్రంలో టీడీపీ ప్రచారం నిర్వహించనుంది.
undefined
పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలోని పోలింగ్ కేంద్రాల్లో పనిచేసేందుకు 8 వేల మంది కార్యకర్తలను టీడీపీ ఎంపిక చేసింది. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్ వద్దకు ఈ కార్యకర్తలు ప్రచారం చేయనున్నారు.
undefined
ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో ప్రచారం కోసం మరో వెయ్యి మందిని సిద్దం చేశారు. మండల స్థాయిలో ఎన్నికల విధులకు 40 మంది నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అన్ని మండలాల పర్యవేక్షణకు 89 మందితో కమిటీని ఏర్పాటు చేశారు.
undefined
ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పర్యవేక్షణకు గాను ఆరుగురు కీలక నేతలతో కమిటీలను ఏర్పాటు చేశారు.
undefined
తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు గాను అనుసరించాల్సిన వ్యూహాంపై టీడీపీ ఎన్నికల వ్యూహాకర్త రాబిన్ శర్మ తిరుపతిలో మకాం వేశారు.
undefined
2019లో జరిగిన ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానంలోనే టీడీపీకి వైఎస్ఆర్‌సీపీ కంటే ఎక్కువ ఓట్లు లభించాయి. మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ కంటే వైఎస్ఆర్‌సీపీకే ఎక్కువ ఓట్లు లభించాయి.
undefined
గత ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీని వీడారు.
undefined
తిరుపతి ఎంపీ స్థానం పరిధిలోని ప్రతి ఓటరును చేరేందుకుగాను 9143 మందిని టీడీపీ ఎంపిక చేసింది.
undefined
గత ఎన్నికల సమయంలో పోటీ చేసిన మాజీ మంత్రి పనబాక లక్ష్మినే టీడీపీ ఈ ఎన్నికల్లో కూడ టీడీపీ బరిలోకి దింపనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం టీడీపీ ఐదంచెల వ్యూహాంతో ముందుకు వెళ్తోంది.
undefined
తిరుపతి లోక్ సభ స్థానం నుండి విజయం సాధించడం ద్వారా వైసీపీపై రాజకీయంగా విజయం సాధించాలని టీడీపీ భావిస్తోంది. ఈ స్థానంలో విజయం సాధిస్తే తమ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపొచ్చని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.
undefined
తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికార టీఆర్ఎస్ కు షాకిచ్చింది. ఏపీ రాష్ట్రంలోని వైఎస్ఆర్‌సీపీకి దెబ్బకొట్టాలంటే ఈ స్థానంలో విజయం సాధించాలని టీడీపీ పట్టుదలగా ఉంది.
undefined
ఈ ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాంపై ఎన్నికల వ్యూహాకర్త రాబిన్ శర్మ పార్టీ నాయకత్వానికి దిశానిర్ధేశం చేస్తున్నారు.
undefined
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలకు సంబంధించి రాబిన్ శర్మ పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు.
undefined
click me!