కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మృతి చెందడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. శ్యామ్ అనే ఆ వీరాభిమాని ఉరివేసుకుని చనిపోయినట్లుగా ఫోటోలు వెలుగు చూశాయి. అయితే, అతని మృతిపై ఎన్టీఆర్ అభిమానులు స్నేహితులు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్యాం స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని కొప్పిగుంట. అతను చనిపోయింది చింతలూరులో. ఉరి వేసుకున్న ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూస్తే ఎన్టీఆర్ అభిమానులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు నిజమేనేమో అనిపిస్తుంది.