Pawan Kalyan Sramadanam : హుకుంపేటలో జనసేన కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్.. (ఫొటోలు)

First Published Oct 2, 2021, 12:51 PM IST

పవన్ కళ్యాణ్ పర్యటన నేపధ్యంలో రాజమండ్రిలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. రాజమండ్రి నగరాన్ని అష్టదిగ్భందనం చేశారు. రాజమండ్రి వైపు వచ్చే వాహనాలపై తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్  సభా ప్రాంగణానికి చేరుకునే దారులన్నీ పోలీసులు మూసివేశారు. సభకు ఇరు వైపులా సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

pawan kalyan

రాజమండ్రిలో శ్రమదానంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి బయలు దేరి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకుని  పార్టీ అధ్యక్షుల వారికి ఘనస్వాగతం పలికారు. 

pawan kalyan

పవన్ కళ్యాణ్ పర్యటన నేపధ్యంలో రాజమండ్రిలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. రాజమండ్రి నగరాన్ని అష్టదిగ్భందనం చేశారు. రాజమండ్రి వైపు వచ్చే వాహనాలపై తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్  సభా ప్రాంగణానికి చేరుకునే దారులన్నీ పోలీసులు మూసివేశారు. సభకు ఇరు వైపులా సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Pawan Kalyan

కాలినడకన కూడా కార్యకర్తలను సభా ప్రాంగణం వైపు వెళ్లనివ్వడం లేదు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి వాహనాలను సైతం లోనికి అనుమతించడం లేదు. పోలీసులు ఇప్పటికే వేలాది మంది జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు, నలుగురు కలసి ఒక చోట ఉన్నా, నడిచి వెళ్తున్నా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపధ్యంతో రాజమండ్రి నగరాన్ని తీవ్ర ఆంక్షలతో అష్టదిగ్భందనం చేశారు

pawan kalyan

శాంతియుతంగా చేపట్టే శ్రమదానానికి ఆటంకాలు సృష్టించడం అప్రజాస్వామికం అని జనసేన చైర్మన్, రాజకీయ వ్యవహారాల కమిటీ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. 

pawan kalyan

గాంధీ జయంతి సందర్భంగా శాంతియుతంగా శ్రమదాన కార్యక్రమం ద్వారా రహదారులకు మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయిస్తే ప్రభుత్వం పోలీసుల ద్వారా ఆటంకాలు సృష్టిస్తోంది. ఇది అప్రజాస్వామిక చర్య. ఇది ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం అన్నారు. 

pawan kalyan

ప్రభుత్వ చేతగానితనం వల్ల రోడ్లు దెబ్బ తింటే జనసేన మరమ్మతులు చేస్తోంది. శ్రమదానం చేస్తామని ఎవరూ చెప్పలేదు.. అనుమతులు లేవు అని పోలీసు అధికారులతో పాలకపక్షం అబద్దాలు చెప్పిస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీన రాష్ట్ర డీజీపీకి ఈ కార్యక్రమం గురించి తెలియచేశాం. అదే  విధంగా రాజమండ్రి అర్బన్ ఎస్పీ, అనంతపురం ఎస్పీకి కూడా తెలియచేశాం. శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనవద్దు అంటూ జనసేన నాయకులను, కార్య కర్తలను గృహనిర్బంధాలు చేస్తూ అడ్డుకొంటున్నారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతాం.

pawan kalyan

పవన్ కల్యాణ్ రాజమండ్రికి చేరుకున్నారు. పవన్ కల్యాణ్ కే రూల్స్ కానీ సీఎంకి రూల్స్ వర్తించవా? అని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, జనం గుమికూడ రాదు అంటూ రూల్స్ చెబుతున్నారు. మరి ఇవే రూల్స్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ రోజు విజయవాడ బెంజి సర్కిల్ లో నిర్వహించే కార్యక్రమానికి ఎందుకు వర్తింపచేయడం లేదు. విజయవాడను దిగ్బంధించి మరీ వేలమందితో చెత్త వాహనాల కార్యక్రమం చేస్తే కోవిడ్ రాదా? అప్పుడు జనం గుమిగూడరా? అంటూ మండిపడ్డారు. 

Pawan Kalyan

పవన్ కల్యాణ్ రాజమండ్రికి చేరుకున్నారు. పవన్ కల్యాణ్ కే రూల్స్ కానీ సీఎంకి రూల్స్ వర్తించవా? అని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, జనం గుమికూడ రాదు అంటూ రూల్స్ చెబుతున్నారు. మరి ఇవే రూల్స్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ రోజు విజయవాడ బెంజి సర్కిల్ లో నిర్వహించే కార్యక్రమానికి ఎందుకు వర్తింపచేయడం లేదు. విజయవాడను దిగ్బంధించి మరీ వేలమందితో చెత్త వాహనాల కార్యక్రమం చేస్తే కోవిడ్ రాదా? అప్పుడు జనం గుమిగూడరా? అంటూ మండిపడ్డారు. 

Pawan Kalyan

మరోవైపు రాజమండ్రి హుకుంపేట సభా ప్రాంగణానికి వెనుక భాగంలో జనసేన కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 

click me!