కాడెద్దుల్లా కూతుళ్లు: సరదాకు వెళ్తే సోనూ సూద్ ట్రాక్టర్, అసలు విషయం ఇదీ...

First Published Jul 27, 2020, 1:26 PM IST

ఈ వీడియో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సోషల్ మీడియాలోని వైరల్ గా మారిన ఈ ఘటనను చూసిన సోను సూద్ ఆ కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. 

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఒక టీ షాప్ యజమాని లాక్ డౌన్ వల్ల తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో షాప్ అద్దె కూడా కట్టలేక ఇంటికి వచ్చారని, ఉన్న రెండున్నర ఎకరాలను దున్నడానికి ఎద్దులు కానీ ట్రాక్టర్ కానీ లేకపోవడంతో... ఇద్దరు కూతుర్లు కాడెద్దులుగా మారి తండ్రికి పొలంలో సహాయం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
undefined
ఈ వీడియో ఆధారంగా అనేక పత్రికల్లో, న్యూస్ ఛానెళ్లలో కథనాలు కూడా ప్రసారమయ్యాయి. టమాటో పండిస్తున్న రైతు దీన గాథఅంటూ ఇంగ్లీష్ చానెల్స్ కూడా దాన్ని ప్రసారం చేసాయి. సోషల్ మీడియాలో అయితే ఆ వీడియోను లక్షల్లో వీక్షించారు. ఎంతో మంది డౌన్ లోడ్స్ చేసి వివిధ గ్రూపుల్లో షేర్ చేసారు.
undefined
మొత్తానికి ఈ వీడియో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సోషల్ మీడియాలోని వైరల్ గా మారిన ఈ ఘటనను చూసిన సోను సూద్ ఆ కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
undefined
తొలుత ఆ కుటుంబానికి రెండు ఎద్దులను కొనిస్తానని చెప్పిన సోను సూద్, ఆతరువాత కొద్దీ సేపటికే వారికి ఎద్దులొక్కటే కొనిస్తే సరిపోవు అని వారికి ట్రాక్టర్ కొనిస్తున్నట్టు ట్వీట్ చేసాడు. సాయంత్రానికల్లా ట్రాక్టర్ చేరుతుందని ట్వీట్ చేసాడు.
undefined
చెప్పినట్టే నిన్న సాయంత్రానికే సోనాలిక ట్రాక్టర్ వాళ్ళింటివద్దకు చేరుకుంది. అందరూ కూడా సోను సూద్ అన్న మాటను నిలబెట్టుకున్నాడు అని తెగ పొగిడేస్తూ ఆయనకు థాంక్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం ఇప్పుడొక హాట్ టాపిక్.
undefined
ఈ జరుగుతున్న పరిణామాలతో అలెర్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అసలు వాస్తవమేమిటో వాకబు చేయమని అధికారులను ఆదేశించింది. కేవీ పల్లె కు చెందిన అధికారులు ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు.
undefined
మీడియా కథనాల్లో వస్తున్నట్టు ఆ కుటుంబం ఎద్దులతో కానీ, ట్రాక్టర్ తో కానీ పొలాన్ని దున్నించలేనంత దీన స్థితిలో లేదని ఎంపిడిఓ తెలిపారు. ఒక మధుర స్మృతిగా మిగిలిపోవడానికి మాత్రమే ఆ కుటుంబం ఈ తరహా పనిని చేపట్టిందని ఆ అధికారి తెలిపారు.
undefined
ఈ చిన్న విషయం ఇంత పెద్దగా మారి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుందని ఎప్పుడు అనుకోలేదనిఆ కుటుంబం తమతో చెప్పినట్టు అధికారులు తెలిపారు. ఆ కుటుంబం కోసం వారి స్వస్థలానికి వచ్చినట్టు తెలుస్తుంది.
undefined
click me!