ముందస్తు వేడుకలు...టిడిపి జాతీయ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

First Published Dec 22, 2020, 3:36 PM IST

ఇవాళ(మంగళవారం) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.

అమరావతి: క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండగ మరో మూడు రోజుల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు కాస్త ముందుగానే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను ప్రారంభించారు.
undefined
ఇవాళ(మంగళవారం) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నేతలుకేక్ కట్ చేసి సెమి క్రిస్మస్ వేడుకలు జరుపుకోగా... మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.
undefined
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్‍కుమార్, అశోక్ బాబు, శ్రీరామ్ తాతయ్య, పట్టాభిరామ్, గంజి చిరంజీవి, తంగిరాల సౌమ్య, పిల్లి మాణిక్యరావు, దివ్యవాణి, మద్దిరాల మ్యాని, మర్రెడ్డి శ్రీనివాస్‍రెడ్డి, చలమారెడ్డి, సయ్యద్ రఫీ బొద్దులూరు వెంకటేశ్వరరావు, కనపర్తి శ్రీనివాసరావు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
undefined
ఈ సందర్భంగా గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగేవని గుర్తుచేసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా పేద ప్రజలకు క్రిస్మస్ కానుకలు ఇచ్చే వారమని... కానీ నేడు ఏ కానుకలు లేకుండా పోయాయి అని మండిపడ్డారు.
undefined
click me!