నలుగురికి ఎమ్మెల్సీ పదవులు...సీఎం జగన్ దృష్టి వీరిపైనే

Arun Kumar P   | Asianet News
Published : Jul 13, 2020, 11:56 AM ISTUpdated : Jul 13, 2020, 12:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో ప్రస్తుతమున్న నాలుగు ఖాళీలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి జగన్ మహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.   

PREV
16
నలుగురికి ఎమ్మెల్సీ పదవులు...సీఎం జగన్ దృష్టి వీరిపైనే

అమరావతి: ఏపీ శాసన మండలిలో  ప్రస్తుతమున్న నాలుగు ఖాళీలను ఎవరితో భర్తీ చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ముస్లిం, ఎస్సీ వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారట. ఈ మేరకు త్వరలో గవర్నర్ కు  ప్రభుత్వం సిఫార్సు చేయనుందట. ఏపీ శాసన మండలిలో నాలుగు ఖాళీలున్నాయి (గవర్నర్ కోటాలో రెండు, శాసన సభ్యుల కోటాలో మరో రెండు). 15 న కాబినెట్ లో గవర్నర్ కోట ఎమ్మెల్సీ లపై నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. 
 

అమరావతి: ఏపీ శాసన మండలిలో  ప్రస్తుతమున్న నాలుగు ఖాళీలను ఎవరితో భర్తీ చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ముస్లిం, ఎస్సీ వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారట. ఈ మేరకు త్వరలో గవర్నర్ కు  ప్రభుత్వం సిఫార్సు చేయనుందట. ఏపీ శాసన మండలిలో నాలుగు ఖాళీలున్నాయి (గవర్నర్ కోటాలో రెండు, శాసన సభ్యుల కోటాలో మరో రెండు). 15 న కాబినెట్ లో గవర్నర్ కోట ఎమ్మెల్సీ లపై నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. 
 

26

ఏపీ శాసన మండలి లో ఖాళీ అయ్యే  నాలుగు స్థానాలు ఎవరికి....సీఎం జగన్ మనసు లో ఏ పేర్లు ఉన్నాయన్నదానిపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. కేవలం వైసీపీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ సాగుతోంది.

ఏపీ శాసన మండలి లో ఖాళీ అయ్యే  నాలుగు స్థానాలు ఎవరికి....సీఎం జగన్ మనసు లో ఏ పేర్లు ఉన్నాయన్నదానిపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. కేవలం వైసీపీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ సాగుతోంది.

36

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో గవర్నర్‌ కోటాలో భర్తీ చేసే సభ్యుల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ, మరొకటి ముస్లిం వర్గాలకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం త్వరలోనే ఈ మేరకు సిఫార్సు చేయనుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో గవర్నర్‌ కోటాలో భర్తీ చేసే సభ్యుల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ, మరొకటి ముస్లిం వర్గాలకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం త్వరలోనే ఈ మేరకు సిఫార్సు చేయనుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

46

ప్రస్తుతం మండలిలో మొత్తం నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణారావు రాజీనామా చేసిన కారణంగా శాసనసభ నుంచి ఎన్నికయ్యే రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. గవర్నర్‌ నామినేట్‌ చేసే కోటాలో కంతేటి సత్యనారాయణరాజు, రత్నాబాయి పదవీ కాలం ముగిసిన కారణంగా ఖాళీ అయిన రెండు స్థానాలు కొంత కాలంగా అలాగే ఉన్నాయి. 
 

ప్రస్తుతం మండలిలో మొత్తం నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణారావు రాజీనామా చేసిన కారణంగా శాసనసభ నుంచి ఎన్నికయ్యే రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. గవర్నర్‌ నామినేట్‌ చేసే కోటాలో కంతేటి సత్యనారాయణరాజు, రత్నాబాయి పదవీ కాలం ముగిసిన కారణంగా ఖాళీ అయిన రెండు స్థానాలు కొంత కాలంగా అలాగే ఉన్నాయి. 
 

56

 వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయించినప్పటికీ పైస్థాయిలో జాప్యం కారణంగా అది ఇప్పటికీ మనుగడలో ఉంది. మండలి రద్దు విషయంలో ఎలాంటి రెండో ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇప్పటికే శాసనసభలో మండలి రద్దుకు తీర్మానం చేసి పంపారు కూడా. అయితే మండలి మనుగడలో ఉన్నంత వరకైనా ఖాళీ స్థానాలను భర్తీ చేయాలన్న ఆలోచనతో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది.  అందువల్ల గవర్నర్‌ నామినేటెడ్‌ స్థానాల్లో ఒకటి ఎస్సీ వర్గానికి, మరో స్థానం ముస్లిం మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు  సమాచారం.   

 వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయించినప్పటికీ పైస్థాయిలో జాప్యం కారణంగా అది ఇప్పటికీ మనుగడలో ఉంది. మండలి రద్దు విషయంలో ఎలాంటి రెండో ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇప్పటికే శాసనసభలో మండలి రద్దుకు తీర్మానం చేసి పంపారు కూడా. అయితే మండలి మనుగడలో ఉన్నంత వరకైనా ఖాళీ స్థానాలను భర్తీ చేయాలన్న ఆలోచనతో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది.  అందువల్ల గవర్నర్‌ నామినేటెడ్‌ స్థానాల్లో ఒకటి ఎస్సీ వర్గానికి, మరో స్థానం ముస్లిం మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు  సమాచారం.   

66

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజీనామా వల్ల ఖాళీ అయిన వాటిలో ఒక స్థానం పదవీ కాలం కేవలం 9 నెలలే ఉంది. మరో ఎమ్మెల్సీ పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది.గవర్నర్ కోటాలో వచ్చే రెండు శాసన సభ్యుల కోటాలో వచ్చే రెండు స్థానాలు త్వరలోనే ఖరారు కానున్నాయి. 

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజీనామా వల్ల ఖాళీ అయిన వాటిలో ఒక స్థానం పదవీ కాలం కేవలం 9 నెలలే ఉంది. మరో ఎమ్మెల్సీ పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది.గవర్నర్ కోటాలో వచ్చే రెండు శాసన సభ్యుల కోటాలో వచ్చే రెండు స్థానాలు త్వరలోనే ఖరారు కానున్నాయి. 

click me!

Recommended Stories