ఈ జిల్లాల్లో కరోనాల మరణాల విజృంభణ: తెలంగాణకు అంటగడుతున్న ఏపీ

First Published Jul 11, 2020, 6:33 PM IST

అత్యధిక కరోనా మరణాలు సంభవించింది కర్నూల్, కృష్ణ జిల్లాల్లో. కర్నూల్ జిల్లాలో 99 మంది మరణిస్తే... కృష్ణ జిల్లాలో 77 మంది మరణించారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 176 మంది మరణించారు. మొత్తం రాష్ట్రంలో గనుక తీసుకుంటే... 56.95 శాతం మరణాలు ఇక్కడే నమోదయ్యాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. ఇందాక కొద్దిసేపటి కింద విడుదల చేసిన కరోనా బులెటిన్ ని గనుక పరిశీలిస్తే 309 మంది కరోనా వైరస్ సోకి మరణించినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
undefined
ఈ గణాంకాలను గనుక కొంచం క్షుణ్ణంగా పరిశీలిస్తే అత్యధిక కరోనా మరణాలు సంభవించింది కర్నూల్, కృష్ణ జిల్లాల్లో. కర్నూల్ జిల్లాలో 99 మంది మరణిస్తే... కృష్ణ జిల్లాలో 77 మంది మరణించారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 176 మంది మరణించారు. మొత్తం రాష్ట్రంలో గనుక తీసుకుంటే... 56.95 శాతం మరణాలు ఇక్కడే నమోదయ్యాయి.
undefined
ఈ రెండు జిల్లాల్లోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు చెప్పినకారణం వింటే విస్తుపోవడం తథ్యం.ఈ రెండు జిల్లాల్లో నమోదవుతున్న మరణాలకు తెలంగాణ రాష్ట్రమే కారణమని వారు చెబుతున్నారు.
undefined
కృష్ణ, కర్నూల్ జిల్లాలు రెండు సైతం తెలంగాణను ఆనుకొని ఉండడం వల్ల తెలంగాణ నుంచి చాలా మంది కరోనా రోగులు తెలంగాణలో బెడ్లు దొరక్క, పాసులకు అప్లై చేసి జ్వరం తగ్గించుకోవడానికి మందులు వాడుతూ ఈ రెండు జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారని వారు తెలిపారు.
undefined
ఈ రెండు జిల్లాలోకి ఎంటర్ అయ్యేసరికి వీరు తీవ్రంగా వైరస్ బారిన పడిఉండటం వల్ల వారు కోలుకోవడానికిసరిపోను సమయం దొరక్క చికిత్స అందించే సమయానికే వారు మరణిస్తున్నారని ప్రభుత్వం చెబుతుంది.
undefined
బెంగళూరు నుంచి కూడా చాలా మంది కర్నూల్ జిల్లాకు రావడం కూడా కర్నూల్ లో కేసులు పెరగడానికి ఒక కారణమని అన్నారు. ఇకపోతే కృష్ణ జిల్లా ప్రధానకేంద్రంగా విజయవాడలో రోజుకి సగటున 14 రైళ్లు వస్తున్నాయని, వారిద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని అంటున్నారు అధికారులు.
undefined
ఇప్పటికే రైల్వే స్టేషన్స్ లో తాము 10 శాతం మందిని రాండమ్ గా టెస్ట్ చేస్తున్నామని అంటున్నారు. గతంలో 5 శాతం మందిని మాత్రమే టెస్ట్ చేసేవారమని, ఇప్పుడు 10 శాతం మందిని టెస్ట్ చేస్తున్నామని అంటున్నారు.
undefined
ఇకపోతే... ఇప్పుడే శనివారం సాయంత్రంవిడుదల చేసిన బులెటిన్ ప్రకారంరాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 27 వేల మార్కును దాటింది. మొత్తం కేసుల సంఖ్య 27,235కు చేరుకుంది. కోవిడ్ -19 రోగుల మరణాల సంఖ్య 300 దాటింది. మొత్తం మరణాలు ఏపీలో 309 నమోదయ్యాయి.
undefined
గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1813 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారిలో 1775 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 34 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చినవారిలో నలుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
undefined
రాష్ట్రంలో నమోదైన 24,422 పాజిటివ్ కేసులకు గాను 12,300 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 11,714 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 20,590 శాంపిల్స్ పరీక్షించగా రాష్ట్రానికి చెందినవారిలో 1775 మందికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
undefined
తాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తో 17 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో నలుగురు మరణించారు. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ముగ్గురేసి మరణించారు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరేసి చనిపోయారు. అనంతపురం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరేసి మరణించారు. దీంతో రాష్ట్రంలో కోరనా వైరస్ మరణాల సంఖ్య 309కి చేరుకుంది.
undefined
click me!