వల్లభనేని వంశీ సహా వారి "చెల్లని" వ్యూహం: కేసీఆర్ ధైర్యం జగన్ కు లేదా?

First Published Jun 21, 2020, 8:37 AM IST

ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి కూడా అదే అవకాశం వచ్చింది. కానీ... జగన్ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. ఆయన గనుక వీరిని ఎన్నికల బరిలో నిలబెట్టి ఉండి ఉంటే, వారిని గనుక గెలిపించుకుంటే... తెలంగాణాలో మాదిరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతిపక్షం లేదు అనే ఆస్కారం ఉండేది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అందరూ ఊహించినట్టే వైసీపీ నాలుగు రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకుంది. సంఖ్యాబలం లేకున్నప్పటికీ... గెలవమని తెలిసినప్పటికీ టీడీపీ వర్ల రామయ్యను అభ్యర్థిగా నిలబెట్టింది.
undefined
ఈ విషయంలో ఎవ్వరికీ ఏ అనుమానమూ లేదు. అందరూ ఈ ఎన్నికలో ఆసక్తిగా ఎదురు చూసింది టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరికీ ఓట్ వేస్తారు అని? వారికి విప్ జారీ చేయడంతో ఆ విషయం అన్నిటికంటేఆసక్తికరంగా మారింది.వారు విప్ అనుసారంగా ఓటింగ్ కి వచ్చారు. కానీ చెల్లకుండా వోట్ వేశారు. వల్లభనేని వంశి, మద్దాలి గిరి, కరణం బలరాం అందరూ కూడా టిక్ మార్క్ పెట్టి వాటిని చెల్లకుండా చేసారు. ముగ్గురు ఇదే రీతిలో చెల్లని ఓట్లు వేయడంతో ఇది కావాలని చేసిందే అనేది తేటతెల్లం.
undefined
అందునా ఎన్నికకు ముందురోజు వైసీపీ రాజ్యసభ ఎంపీ, పార్టీలో నెంబర్ 2 గా చెలామణి అయ్యే విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ ఎన్నికపై అందరు ఎమ్మెల్యేలకు అవగాహనా తరగతులు నిర్వహించారు. అంటే... సదరు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలందరికీ ఇక్కడి నుండే ఆదేశాలు పోయాయి అనేది సుస్పష్టం.
undefined
అయితే.... వారు గనుక బాజాప్తా వైసీపీకి వోట్ వేసి ఉంటే... వారిపై అనర్హత వేటు పడేది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పై అనర్హత వేటు గనుక పడిఉంటే వారు ఉప ఎన్నికకు వెళ్లాల్సివచ్చేది. ఉప ఎన్నికకు గనుక వెళ్లి ఉంటే... ప్రతిపక్షాన్ని కిక్కురుమనకుండా చేసే వీలుండేది.
undefined
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే పాలసీని పలు సందర్భాల్లో ఫాలో అయ్యారు. తాజాగా గనుక తీసుకుంటే.... 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అప్రతిహత విజయం సాధించింది. అపోజిషన్అన్న ఊసే లేకుండా చేసింది. ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్ కి చెందిన వారిని కొందరిని చేర్చుకుంది. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదానే లేకుండా చేసింది.
undefined
ఒక ఆరు నెలలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే... లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. డిసెంబర్ ఎన్నికల సీన్, ఆ తరువాత చేరికలు చూసి తెరాస అన్ని సీట్లను కైవసం చేసుకుంటుంది, ఒక సీట్ మజ్లీస్ దిఅని అంతా అనుకున్నారు. తెరాస నాయకులూ సైతం దీన్నే నమ్మారు.సారు,కారు, పదహారు, ఢిల్లీ సర్కారు అనే ఒక నినాదాన్ని కూడా ముందుకు తీసుకొచ్చింది తెరాస. ఇలా అంతా తమకు అనుకూలంగానే సాగుతుందని తెరాస ఊహించింది. ప్రజలు కూడా అలానే అనుకున్నారు.
undefined
కానీ తెరాస కు ఊహించని షాక్ తగిలింది. సావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచింది. ఏకంగా కేసీఆర్ కూతురు కవిత కూడా ఓటమి చెందింది. అనూహ్యంగా బీజేపీ ఉత్తర తెలంగాణాలో గెలిచింది. మొత్తంగా నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మూడు స్థానాలను కైవసం చేసుకుంది. మరో రెండు స్థానాల్లో వెంట్రుకవాసిలో ఓటమి చెందింది.
undefined
ఇక దానితో అందరూ కేసీఆర్ పని అయిపోయింది అని అనుకున్నారు. ఇంతలోనే తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె మొదలయింది. కేసీఆర్ పనయిపోయిందంటూ ప్రతిపక్షాలు కూడా ప్రచారం చేసాయి. అపోజిషన్ పార్టీలన్నీ ఆర్టీసీ కార్మికుల సమ్మెను వారి రాజకీయ ఎత్తుగడలకు వేదికగా వాడుకున్నారు.
undefined
ఈ తరుణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ పార్లమెంటు సభ్యుడిగా గెలవడంతో... ఆయన హుజూర్ నగర్ సీటును ఖాళీ చేయవలిసి వచ్చింది. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి పద్మావతిని నిలబెట్టారు.
undefined
ఉప ఎన్నిక కావడం ఇంకా నాలుగున్నర సంవత్సరాల పాలన మిగిలి ఉండడం, అన్ని వెరసి తెరాస అక్కడ బ్రహ్మాండమైన మెజారిటీ సాధించింది. దాదాపుగా 43 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో సైది రెడ్డి ఉత్తమ్ భార్యపై విజయం సాధించాడు. సిట్టింగ్ సీటులో భార్యను గెలిపించుకోలేకపోయాడు అని అప్పటివరకు నిద్రాణంగా ఉన్న తెరాస వర్గాలు అన్ని జూలు విదిల్చాయి.
undefined
కేసీఆర్ మరోమారు బహిరంగ వేదికపై తానేతెలంగాణకు నిజమైన నాయకుడనని,తనకు ఎదురు వచ్చే వారే లేరు అని ఆయన తనదయన స్టైల్ లో ప్రతిపక్షంపై విరుచుకుపడ్డాడు. ఆయన ఇక ఆతరువాత తెలంగాణాలో ప్రతిపక్షమే లేదు అనే మాటను బలంగా జనాల్లోకి తీసుకుపోవడంలో వారిని అణిచివేయడంలో సఫలీకృతులయ్యారని చెప్పక తప్పదు.
undefined
ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి కూడా అదే అవకాశం వచ్చింది. కానీ... జగన్ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. ఆయన గనుక వీరిని ఎన్నికలబరిలో నిలబెట్టి ఉండిఉంటే, వారిని గనుక గెలిపించుకుంటే... తెలంగాణాలో మాదిరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతిపక్షం లేదు అనే ఆస్కారం ఉండేది. కానీ అలా జరగలేదు.
undefined
దానికి కారణం కూడా లేకపోలేదు. వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే. మద్దాలి గిరి గుంటూరు వెస్ట్ నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాలు కూడా రాజధాని అమరావతిని ఆనుకొని ఉన్న ప్రాంతాలు. ఇక్కడ రాజధాని తరలింపు అంశం వల్ల వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఉంది.
undefined
అది ఎన్నికల్లో ప్రతిబింబించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. దానితోపాటుగా వైసీపీ ఇంచార్జి ల పరిస్థితి. వారు వైసీపీని నమ్ముకొని ఉన్నవారు. ఇటు యార్లగడ్డ గన్నవరంలో అటు అప్పిరెడ్డి గుంటూరు వెస్ట్ లో వీరి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నతోపాటుగా పూర్తి మద్దతు అందిస్తారు అనే ప్రశ్న. రాజధాని అంశం అన్నిటికంటే ఈ రెండు స్థానాల్లో బలమైన ప్రభావాన్ని చూపే ఆస్కారం ఉండేది.
undefined
ఇక కరణం బలరాం విషయంలో కూడా ఆమంచి కృష్ణమోహన్ ఫాక్టర్ బలంగా ఉంది. ఆ స్థానం గెలవగలిగే ఆస్కారం మాత్రం వైసీపీకి ఉండేది. కానీ రాజధానికి దగ్గరగా ఉన్న ఈ రెండు స్థానాల్లో మాత్రం కొంత కష్టమే. అందుకే జగన్ ఇలా వారితో చెల్లని ఓట్లు వేయించినట్టుగా కనబడుతుంది.
undefined
click me!