ఢిల్లీ : వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తరువాతి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని.. అహర్నిశలు పాటుపడ్డారని.. అభివృద్ధికి చిరునామాగా చంద్రబాబు నిలిచారని ప్రశంసల జల్లు కురిపించారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.