పెరిగిన ధరల ఎఫెక్ట్: ఏపీలో భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు

First Published May 11, 2020, 11:39 AM IST

మద్యం ధరలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కారణంగా రాష్ట్రంలో భారీగా మద్యం విక్రయాలు పడిపోయినట్టుగా సర్కార్ గణాంకాలు చెబుతున్నాయి.

ఏపీ రాష్ట్రంలో మద్యం ధరలను పెంచిన తర్వాత విక్రయాలు భారీగా తగ్గినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. లాక్ డౌన్ ఆంక్షల మినహాయింపులో భాగంగా మద్యం దుకాణాలను ఓపెన్ చేసింది ఏపీ ప్రభుత్వం. దేశంలోని పలు రాష్ట్రాలు మద్యం దుకాణాలు తెరిచిన విషయం తెలిసిందే.
undefined
దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తామని ఎన్నికల ముందు వైసీపీ ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. మద్యం దుకాణాలను తెరిచిన రోజున మద్యం ధరలను తొలుత 25 శాతం పెంచింది. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకుండా పెద్ద ఎత్తున జనం బారులు తీరిన దృశ్యాలు కన్పించాయి.
undefined
దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరునాడే మద్యం ధరలను మరో 50 శాతం పెంచింది. దీంతో మద్యంపై రెండు రోజుల వ్యవధిలో 75 శాతం పెంచింది. పెంచిన ధరలతో లిక్కర్ షాపుల వద్ద క్యూ లైన్లు తగ్గినట్టుగా అధికారులు గుర్తించారు.
undefined
పెంచిన దరల కారణంగా రాష్ట్రంలో రెండు రోజులుగా మద్యం విక్రయాలు బాగా తగ్గిపోయినట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వారంతంలో మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి శనివారం సుమారు రూ. 70 నుండి 80 కోట్ల మద్యం విక్రయాలు సాగుతాయి.కానీ ఈ నెల 9వ తేదీన రాష్ట్రంలో కేవలం 40.77 కోట్ల మేరకు మాత్రమే విక్రయాలు సాగినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది.
undefined
నాటుసారాతో పాటు అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ మేరకు స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) శనివారం నాడు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.
undefined
ఈ నెలాఖరుకు మద్యం దుకాణాలను మరింత తగ్గించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నెలాఖరు నాటికి 13 శాతం మద్యం దుకాణాలను తగ్గించనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల్లో 566 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అయితే ఏ దుకాణాలు మూతపడతాయే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
undefined
ఈ నెల 8వ తేదీన మద్యం, బీరు కలిపి 15.55 లక్షల బాటిల్స్ విక్రయాలు చోటు చేసుకొన్నాయి. వీటి విలువ రూ. 42.72 కోట్ల విలువగా అధికారులు తెలిపారు. శనివారం నాడు 15.40 లక్షల బాటిల్స్ మాత్రమే విక్రయాలు చోటు చేసుకొన్నాయి. వీటి విలువ రూ. 40.77 కోట్లుగా అధికారులు ప్రకటించారు.
undefined
ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్ వరకు అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న 7812 మందిపై కేసులు నమోదు చేశారు.5870 మందిని అరెస్ట్ చేశారు.97,482 లీటర్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.
undefined
click me!