నివర్ బాధితులకు అండగా... రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్ (ఫోటోలు)
First Published Dec 2, 2020, 2:13 PM ISTవిజయవాడ: నివర్ తుపాన్ మూలంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి... వారి కష్టాలను స్వయంగా తెలుసుకొనేందుకు పవన్ కల్యాణ్ నాలుగు రోజులపాటు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడుతున్నారు. ఇవాళ హైదరాబాద్ నుండి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన కృష్ణా జిల్లాలో నివర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జిల్లాలోని ఉయ్యూరు నుండి ప్రారంభమైన యాత్ర పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాలమీదుగా సాగనుంది. ఆయా ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు. అక్కడి రైతులను కలిసి వారి బాధలను తెలుసుకొంటున్నారు.