గ్రీన్ ఛానల్ ద్వారా ఆక్సీజన్ ట్యాంకర్.. 400 మంది ప్రాణాలు కాపాడిన పోలీసులు !

First Published May 7, 2021, 10:44 AM IST

విజయవాడ GGHలో పెను ప్రమాదం తప్పింది.  ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు సకాలంలో ఆక్సిజన్ అందేలా కృషి చేసి 400 మంది ప్రాణాలను కాపాడారు. 

విజయవాడ GGHలో పెను ప్రమాదం తప్పింది. ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు సకాలంలో ఆక్సిజన్ అందేలా కృషి చేసి 400 మంది ప్రాణాలను కాపాడారు.
undefined
వివరాల్లోకి వెడితే.. విజయవాడ GGHలో సుమారు నాలుగు వందల మంది కోవిడ్ భాదితులు ఆక్సిజన్ తో చికిత్స పొందుతున్నారు. జీజీహెచ్ కు 18టన్నుల ఆక్సీజన్ తో వస్తున్న ట్యాంకర్ గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థ తో సంబంధాలు తెగిపోయాయి.
undefined
దీంతో రోగుల పరిస్థితి దిగజారిపోతుండడం, క్షణక్షణానికి ఇది ప్రాణాంతకంగా పరిణమిస్తుందని ఆందోళన పడ్డ సంబంధిత అధికారులు విజయవాడ సిటీ కమిషనర్ కి సమాచారాన్ని చేరవేశారు.
undefined
సమచారం అందుకున్న వెంటనే విజయవాడ సి.పి హుటాహుటిన రంగంలోకి దిగారు. ఒరిస్సా నుండి విజయవాడ వరకు ఉన్న అన్ని మార్గ మధ్యలో ఉన్న జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేశారు.
undefined
ఈ నేపథ్యంలో ఈస్ట్ గోదావరి జిల్లా, ధర్మవరం వద్ద ఓ డాబా లో ఆక్సిజన్ ట్యాంకర్ ని ప్రత్తిపాడు పోలీసులు గుర్తించారు.
undefined
డ్రైవర్ ను పట్టుకుని ప్రశ్నించగా... నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా లో నిమగ్నం అవడంతో అలసిపోయానని, అందుకే వాహనాన్ని నిలిపి వేసినట్టుగా పత్తిపాడు సిఐ కి డ్రైవర్ వివరించాడు.
undefined
ఈ మేరకు డ్రైవర్ సమస్యను ప్రత్తిపాడు సిఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు. పై అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.
undefined
డ్రైవర్ కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డుతో ఆక్సిజన్ ట్యాంకర్ ను గ్రీన్ ఛానల్ ద్వారా సురక్షితంగా విజయవాడ జి.జి.హెచ్ కి చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
undefined
click me!