రాజధాని దీక్షలు @ 500 : త్యాగం నిరుప‌యోగం కాదు.. అమ‌రావ‌తి శాశ్వ‌తం.. నారా లోకేష్‌

First Published Apr 30, 2021, 9:20 AM IST

అమరావతి దీక్షలు 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాలోకేష్ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు. కార్యరాజ‌ధాని లేని రాష్ట్రానికి  ప్ర‌జ‌లే ముందుకొచ్చి త‌మ భూముల్ని త్యాగం చేసి ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తికి పునాదులు వేయ‌డానికి దోహ‌ద‌ప‌డ్డారని చెప్పుకొచ్చారు. 

అమరావతి దీక్షలు 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాలోకేష్ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు. కార్యరాజ‌ధాని లేని రాష్ట్రానికి ప్ర‌జ‌లే ముందుకొచ్చి త‌మ భూముల్ని త్యాగం చేసి ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తికి పునాదులు వేయ‌డానికి దోహ‌ద‌ప‌డ్డారని చెప్పుకొచ్చారు.
undefined
దేశంలోనే తొలిసారిగా 30 వేల‌మంది అన్న‌దాత‌లు స్వ‌చ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కి స‌హ‌క‌రించడంతో న‌వ్యాంధ్ర రాజ‌ధానిగా విల‌సిల్లింది అమ‌రావ‌తి. ముఖ్య‌మంత్రిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే సంప‌ద‌లాంటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమ‌రావ‌తిని కొన‌సాగించి, అభివృద్ధి చేయాల్సిన జ‌గ‌న్‌రెడ్డి స‌ర్వ‌నాశ‌న‌మే ల‌క్ష్యంగా మూడు రాజ‌ధానుల పేరుతో విద్వేషాలు విర‌జిమ్మారని మండిపడ్డారు.
undefined
నాటి నుంచి ప్ర‌జారాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణకి న‌డుం బిగించిన రైతులు, మ‌హిళ‌లు స‌క‌ల జ‌నులూ శాంతియుతంగా ఉద్య‌మించారు. అధికారం అండ‌తో ఉద్య‌మాన్ని ఉక్కుపాదంతో అణిచేసినా ఒక్క‌రూ వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఒకే రాష్ట్రం- ఒకే రాజ‌ధాని అంటూ గొంతెత్తి నిన‌దిస్తూనే వంద‌లాది గుండెలు ఆగిపోయాయి.
undefined
అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణే ల‌క్ష్యంగా 500 రోజులుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న అన్న‌దాత‌లు, మ‌హిళ‌లు, ఉద్య‌మ‌కారులంద‌రికీ ఉద్య‌మాభివంద‌నాలు. మీ త్యాగం నిరుప‌యోగం కాదు..అమ‌రావ‌తి శాశ్వ‌తం.. ప్ర‌జారాజ‌ధానిదే అంతిమ విజ‌యం..జై అమ‌రావ‌తి... జై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. అంటూ ఉద్యమకారులకు మద్దతు పలికారు.
undefined
ఇఅమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణే ల‌క్ష్యంగా 500 రోజులుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న అన్న‌దాత‌లు, మ‌హిళ‌లు, ఉద్య‌మ‌కారులంద‌రికీ ఉద్య‌మాభివంద‌నాలు. మీ త్యాగం నిరుప‌యోగం కాదు..అమ‌రావ‌తి శాశ్వ‌తం.. ప్ర‌జారాజ‌ధానిదే అంతిమ విజ‌యం..జై అమ‌రావ‌తి... జై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. అంటూ ఉద్యమకారులకు మద్దతు పలికారు.
undefined
కాగా, అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న దీక్ష 500వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి ఐకాస ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయనున్నారు. అమరావతి ఉద్యమ భేరి పేరుతో వర్చువల్ విధానంలో సభ.
undefined
ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సభ జరగనుంది. దీంట్లో లక్ష మంది పాల్గొనేవిధంగా అమరావతి ఐకాస ఏర్పాట్లు చేసింది. రైతుల ఉద్యమానికి వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల మద్దతు. ఏడాదిన్నరగా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న మహిళలు .
undefined
2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో 3 రాజధానులపై సీఎం జగన్ ప్రకటన చేశారు. ఆ తరువాత 2019 డిసెంబర్ 18 నుంచి రాజధాని గ్రామాల్లో ఉద్యమం మొదలయ్యింది. రాజధాని గ్రామాల్లో 3 వేలమందికి పైగా వివిధ కేసులు నమోదయ్యియి.రాజధాని చట్టాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో న్యాయపోరాటం జరిగింది.
undefined
500వ రోజుకు చేరుకున్న సందర్భంగా ప్రధానికి ఐకాస నేతల లేఖలు రాశారు. సీఎం జగన్ తో మాట్లాడి నచ్చజెప్పాలని ఐకాస నేతలు కోరారు. వర్చువల్ సభలో రైతులను ఉద్దేశించి చంద్రబాబు, సోము వీర్రాజు, సీపీఐ నేత రామకృష్ణ, శైలజానాథ్, తులసిరెడ్డి తదితరులు మాట్లాడనున్నారు.
undefined
500వ రోజుకు చేరుకున్న సందర్భంగా ప్రధానికి ఐకాస నేతల లేఖలు రాశారు. సీఎం జగన్ తో మాట్లాడి నచ్చజెప్పాలని ఐకాస నేతలు కోరారు. వర్చువల్ సభలో రైతులను ఉద్దేశించి చంద్రబాబు, సోము వీర్రాజు, సీపీఐ నేత రామకృష్ణ, శైలజానాథ్, తులసిరెడ్డి తదితరులు మాట్లాడనున్నారు.
undefined
click me!