ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం
దేశంలో సిల్క్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, కాటన్ ఉత్పత్తిలో ఆరో స్థానంలో, జనపనార ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉందని మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్రంలో 9 టెక్స్ టైల్, అపెరల్ పార్కులు ఉన్నాయన్నారు. వాటిలో ఆరు ప్రభుత్వ రంగంలో ఉండగా... మూడు ప్రైవేటు రంగంలో ఉన్నాయన్నారు. 146 మెగా టెక్స్ టైల్ ఇండస్ట్రీలు, 18,500 యూనిట్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 15 టెక్నికల్ టెక్స్ టైల్ కంపెనీల్లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, మూడు ఇండస్ట్రీస్ కారిడార్లు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో అగ్రో టెక్స్ టైల్, జియో టెక్స్ టైల్, మొబైల్ టెక్స్ టైల్కు అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ అవకాశాలను వినియోగించుకొని రాష్ట్రంలో టెక్స్ టైల్, అపెరల్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి సవిత ఆహ్వానం పలికారు.
టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, టెక్స్ టైల్ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి సవిత పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు పెంచడమే తమ ప్రభుత్వ నూతన పాలసీ లక్ష్యమని స్పష్టం చేశారు. అంతకుముందు పలువురు స్టేక్ హాల్డర్లు తమ అనుభవాలను, ఆలోచనలను, సూచనలను పంచుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి సవిత.. స్టేక్ హోల్డర్ల ఆలోచనలు, సూచనలు కొత్త పాలసీ రూపకల్పనలో పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.