అమరావతి : వర్షాకాలం వచ్చిందంటే చాలు విద్యుత్ షాక్ సమస్య పెరిగిపోతుంది. ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడి కొన్నిసార్లు, బాగా తడిసిన స్తంబాల్లో, గోడల్లో విద్యుత్ ప్రసరణ... ఇలా అనేక విధాలుగా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి వర్షాకాలంలో విద్యుత్ షాక్ లతో మరణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ప్రమాదాలపై చర్చించేందుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ అధికారులు వర్చువల్ సమావేశం నిర్వహించారు.