న్యూడిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సిఐడి నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు పెద్ద కుంభకోణమని... ఇందులో ఆనాటి మంత్రి లోకేష్ పాత్ర వుందని సిఐడి ఆరోపిస్తోందట. ఈ మేరకు ప్రస్తుతం డిల్లీలో వున్న లోకేష్ కు సిఐడి అధికారులు బృందం నోటీసులు అందించింది. ఈ సమయంలో సిఐడి అధికారులతో జరిగిన సంభాషణ బయటపెడుతూ తనకు అందించిన నోటీసులపై లోకేష్ స్పందించారు.