అధినేత చంద్రబాబు జైల్లో, ఆయన కొడుకు లోకేష్ డిల్లీలో వుండటంతో టిడిపిలో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో టిడిపి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారు లేకుండాపోయారు. చంద్రబాబును జైల్లో పెట్టడంతో టిడిపి ఆందోళనకు పిలుపునిచ్చినా అవి ప్రజలను అంతగా కదిలించడం లేదు. దీంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆందోళన మొదలయ్యింది. ఈ పరిస్థితిని గమనించిన టిడిపి సీనియర్లు నారా భువనేశ్వరిని రంగంలోకి దింపుతున్నారు.