మొత్తంగా కృష్ణాజిల్లాలో ఐదు రోజులపాటు పవన్ పర్యటన కొనసాగనుంది. అవనిగడ్డలో సభ, యాత్ర అనంతరం పవన్ మచిలీపట్నం చేరుకోనున్నారు. రెండో తేదీ కృష్ణాజిల్లా జనసేన నాయకులతో సమావేశం, మూడో తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం నాలుగో తేదీన పెడన, ఐదోతేదీన కైకలూరు నియోజకవర్గంలో వారాహి యాత్ర చేపట్టనున్నారు.