టిడిపి, జనసేన కలిసాయి కాబట్టి పలు జిల్లాల్లో కాపు, బిసి సామాజికవర్గాలను సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి వుంది. క్షేత్రస్థాయిలో ఈ రెండు సామాజికవర్గాలను కలుపుకుపోయేలా టిడిపి శ్రేణులను సిద్దం చేయాల్సి వుంది. కమ్మ, కాపు, బిసి సామాజికవర్గాలను ఒక్కతాటిపై తీసుకువస్తే విజయం తమదేనన్న ధీమాతో టిడిపి, జనసేన పార్టీలు వున్నాయి. కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిసి నాయకులకు అధిక సీట్లు కేటాయించడానికి టిడిపి, జనసేన కూటమి సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది.